2019 ఎన్నికలలో కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చారని సంగతి తెలిసిందే. ఫలితాలు వచ్చిన తీరు బట్టి చూసి విపక్షాలకు మైండ్ బ్లాక్ అయినట్లు అయింది. చాలావరకు ఇతర పార్టీల మద్దతుతో మోడీ కేంద్రంలో ప్రభుత్వం పోటిస్తారని భావించగా దానికి భిన్నంగా 2014 ఎన్నికలలో కంటే ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలిచి మోడీ అధికారంలోకి వచ్చారు.
అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక మోడీ చాలా కీలక నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ క్రమంలో ఎన్డీయేకు దగ్గరగా ఉండే కొన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం దూరమవుతూ ఉన్నాయి. మొన్న అఖిల దళ్ పార్టీ అంతకుముందు శివసేన బిజెపికి దూరమైన సంగతి తెలిసిందే. దీంతో చాలా వరకు దేశంలో మోడీ ప్రభావం తగ్గుతుంది అన్న టాక్ ప్రస్తుతం బలంగా వినబడుతుంది.
మరో పక్క రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో పిసినారితనంగా కేంద్రం వ్యవహరిస్తున్నట్లు చాలా ప్రాంతీయ పార్టీలు బయటకు చెప్పకపోయినా లోలోపల మోడీ సర్కార్ పై అసహనంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కనుక బిజెపి దారుణంగా ఓటమి చెందితే మాత్రం జాతీయ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారటం గ్యారెంటీ అని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో లో ఎన్నికల పరిస్థితి గమనిస్తే లాలూ కొడుకు గెలవాలని దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలతో పాటు కొన్ని కీలక పార్టీలు కోరుకుంటున్నాయి. అంతే కాకుండా ఆయనకు బయట నుండి కూడా మద్దతు ఇస్తున్నాయి. దేశంలో చాలా రాష్ట్రాలకు ఇవ్వవలసిన నిధుల విషయంలో మోడీ సర్కార్ మొండివైఖరి అవలంభిస్తున్న తరుణం లో… బీహార్ రాష్ట్రంలో ఓడిపోతే ఖచ్చితంగా ఈ దెబ్బతో మోడీ తగ్గటం గ్యారెంటీ అనే భావనలో ప్రాంతీయ పార్టీలు మరి కొన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మోడీ సర్కార్ మొండి చెయ్యి చూపిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తో పాటు తాజాగా పోలవరం విషయంలో కూడా దెబ్బ వేసే రీతిలో వ్యవహరించడం జరిగింది. దీంతో బీహార్ లో కనుక బిజెపి ఓడిపోతే మాత్రం మోడీ తగ్గటం గ్యారెంటీ అని టాక్ నడుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ లో ఫలితాలు కూడా అదేరీతిలో ఉండటంతో… బీహార్ లో తాజాగా జరిగిన ఎన్నికల విషయంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అనే టెన్షన్ లో అందరూ ఉన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?