2014 సార్వత్రిక ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో బలమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో సుస్థిరం చేసుకున్నారు మోడీ. దీంతో మోడీ కి వచ్చిన మెజారిటీ చూసి ఇంకా ఇండియాలో ఎన్డీఏ హవా కొనసాగుతోందని, ఇప్పుడప్పుడే వీరిని ఎదుర్కోలేం అని జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు అంత డిసైడ్ అయిపోయాయి. కానీ సీన్ రివర్స్ అయింది. రెండోసారి పదవీ చేపట్టాక మోడీకి అగ్ని పరీక్ష లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెండోసారి ఫుల్ మెజార్టీ ఉండటంతో మొదట్లో జమ్మూకాశ్మీర్ ఆర్టికల్ 370 మరియు nrc,npr,caa ఇలాంటి కీలక వివాదాస్పద విషయాలలో చాలా దూకుడుగా వ్యవహరించారు. మోడీ స్పీడ్ చూసి దేశంలో కొన్ని వర్గాల ప్రజలు ఖంగు తిన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ రావటంతో దేశవ్యాప్తంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వైరస్ దాటికి పేద మరియు అన్ని రంగాల ప్రజలు పూర్తిస్థాయిలో నష్టపోవడంతో ఏం చేయలేని పరిస్థితి కేంద్రం లో నెలకొంది. దీంతో ఆర్థికంగా భారత్ మరింత దెబ్బతింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి ప్రస్తుతం దేశం కోలుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా భారత్-చైనా సరిహద్దు వద్ద యుద్ధవాతావరణం నెలకొనడంతో.. ఈ సవాల్ మోడీకి పెనుసవాలుగా మారింది. ఒక్క చైనా నుంచి మాత్రమే కాదు నేపాల్ మరియు పాకిస్తాన్ ఇలా భారత్ చుట్టుపక్కల దేశాల నుండి….ఇప్పుడు తీవ్రమైన విదేశీ యుద్ధం జరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు మూడు వైపుల ఉన్న విదేశీ సరిహద్దుల నుండి భారత్ పై యుద్ధమేఘాలు అలుముకున్న పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా భారత్-చైనా సరిహద్దు గాల్వానా లోయలో ఏర్పడిన ఉద్రిక్తతలు మోడీకి కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. ఈశాన్య లద్ధాఖ్ ప్రాంతంలో ఉన్న గాల్వానా నదిని పూడ్చివేయడానికి లేదా.. ఇక్కడ ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతాన్ని భారత్ వదులుకుంటే మాత్రం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. మొత్తంమీద చూసుకుంటే కరోనా ని బాగానే ఎదుర్కొన్నాం అని అనుకుంటున్న సమయంలో మూడు వైపుల నుండి భారత్ పై యుద్ధమేఘాలు అలుము కోవటం మోడీకి కొత్త సమస్యలను తెచ్చి పెట్టినట్లు అయిందని అంతర్జాతీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.