కృష్ణా నదీజలాలపై ఏర్పాటుచేసిన కృష్ణా బోర్డు ఉన్నా పెద్దగా ఉపయోగం లేదు. ఈ నేపథ్యంలో ఆ బోర్డును రద్దు చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. దానిస్థానంలో ప్రత్యేక ఆథారిటీని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.ఇదే విషయం నెల రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వంలోని జలశక్తి శాఖ అధికారులు చర్చలు చేస్తున్నారు. కృష్ణా బోర్డు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే నదుల బోర్డులు ఉన్నా దానికి ఎలాంటి అధికారాలు లేవు. బోర్డు సూచనలని ఆదేశాలను రాష్ట్రాలు పట్టించుకోకపోవడం లేదు. బేసిన్లో కొన్ని రాష్ట్రాలకు ఈ బోర్డుతో ఎలాంటి సంబంధం లేకపోవడంతో కేంద్రం ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే కృష్ణా బోర్డు తీసేసి అథారిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు నిర్వహణ నీటి విడుదల వంటి అంశాల్లో కేంద్రం పాత్ర లేకపోవడం ప్రధానంగా గుర్తించింది. నీళ్ల విషయంలో కూడా రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించేందుకు చర్యలు చేపట్టింది.కృష్ణా బోర్డు రద్దు చేసి అథారిటీ ఏర్పాటు చేస్తే దీని పరిధిలోకి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర వస్తాయి. అధికారాలు ఉండడంతో రాష్ర్టాలపై పెత్తనం చేయవచ్చు.దక్షిణ భారతదేశంలో ప్రధాన నది కృష్ణ. మహారాష్ట్ర కర్నాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జీవ నదిగా కొనసాగుతోంది.
ఈ నది బిరబిరా పరుగులు పెడుతూ ప్రజల సాగు తాగునీటితో పాటు విద్యుచ్చక్తికి కీలకంగా ఉంది. అయితే ఈ నదిపై రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఈ నీటి పంచాయితీ కేంద్రం వద్దకు వెళ్లినా అపరిష్కృతంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో కృష్ణా బేసిన్ మొత్తానికి ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.ఈవిధంగా త్వరలోనే ఈ మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.అయితే కృష్ణా బోర్డు రద్దు చేసి అథారిటీ ఏర్పాటుచేస్తే ఇక రాష్ట్రాలు తప్పనిసరిగా కేంద్ర అనుమతులు పొందాల్సిందే. కేంద్రం చెప్పినట్టు వినాల్సిందే. ఆ విధంగా చట్టం రూపొందించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.