Modi offer : మరో రెండు వారాల్లో 2022 బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై చాలామంది ప్రజలకు భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రం 2022 బడ్జెట్లో అన్నదాతలపై వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి కారణం అన్నదాతలు ఎక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో త్వరలోనే ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇప్పటికే వ్యతిరేఖత మూటగట్టుకున్న మోదీ సర్కార్ రైతులను బుజ్జగించేందుకు చేయాల్సి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పీఎం కిసాన్ స్కీమ్ కింద అందించే ప్రయోజనాన్ని రెట్టింపు చేసే అవకాశమునట్లు పలువురు వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Modi offer: రెట్టింపు డబ్బులు?
చాలా రోజుల నుంచే పీఎం కిసాన్ డబ్బులు రెట్టింపు చేయాల్సిందిగా దేశవ్యాప్తంగా బలమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం వల్ల డీజిల్, ఎరువులు, ఫెర్టిలైజర్స్ ధరలు ఎన్నడూ లేని విధంగా ఆకాశన్నుంటుతున్నాయి. ఫలితంగా రైతులపై అదనపు భారం పడుతోంది. అందుకే పీఎం కిసాన్ ప్రయోజనాలను పెంచాలని చాలా మంది అభ్యర్థిస్తున్నారు. ఇలా పీఎం కిసాన్ నగదు రెట్టింపు చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతీ సంవత్సరం అకౌంట్లలోకి రూ.12 వేలు
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రైతన్నలకు ప్రతి సంవత్సరం మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున అందిస్తోంది. ఈ నగదు రైతుల బ్యాంకు అకౌంట్ లో నేరుగా జమ అవుతున్నాయి. అయితే స్కీమ్ ప్రారంభించిన సమయం నుంచి ఇవే డబ్బులు ఇస్తున్నారు కానీ పెంచడం లేదు. ఇప్పటి వరకు మోదీ సర్కార్ పది విడతల్లో రూ.20 వేలు ఇచ్చింది. అయితే కొత్త బడ్జెట్ తర్వాత ప్రతి సంవత్సరం మూడు సార్లు రూ.4 వేల చొప్పున మొత్తంగా 12,000 అందించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇది నిజమా కాదా అనేది ఫిబ్రవరి ఒకటో తేదీతో తేలిపోతుంది.
Scheme offers : సూపర్ స్కీమ్.. ప్రతి నెలా రూ.10 వేలు పొందండిలా.. ఎలా అంటే?