భారతదేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తుండడంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాప్తి పరిస్థితులపై ఏడుగురు ముఖ్యమంత్రులతో మాట్లాడారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ముందుగా పరీక్షలు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను వేగంగా సమకూర్చుకుని అత్యధిక సంఖ్యలో టెస్టులు జరిపించడం పై ముఖ్యమంత్రి జగన్ ను నరేంద్ర మోడీ అభినందించారు. అయితే నిన్న ఒక్కరోజే ఐదు వేలకు పైగా కేసులు నమోదు కావడం పై ఆరా తీసినట్లు సమాచారం.
ఇక పోతే ఇదే సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ రో మాత్రం గత మూడు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి బాగానే ఉండటంతో…. వారి సంభాషణ కాస్త సజావుగా సాగింది. ఇకపోతే రోజుకు కనీసం నలభై నుండి యాభై మరణాలు ఆంధ్రప్రదేశ్లో సంభవించడం గూర్చి మోడీ జగన్ ను ప్రశ్నించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుండి వైద్య పరికరాల విషయంలో కాని ఇంకా ఏ విషయంలో అయినా సహాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మోడీ భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
సాధారణంగా చూసుకుంటే కరోనా విషయమై ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలోనే ఎక్కువగా ఆరాలు తీయాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో అయితే టెస్టులు జరపాలే గానీ…. జరిపిన టెస్టుల్లో సగం మందికి పాజిటివ్ అని వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో గత వారం మొదట్లో పరిస్థితి బాగానే ఉంది కానీ ఆ తర్వాత భారీ స్థాయిలో కేసులు బయటపడడం మరీ ముఖ్యంగా మరణాలు పెరిగిపోవడంతో మోదీ జగ తోనే ఎక్కువగా సంభాషించు సంభాషించడం జరిగింది.
ఇదిలా ఉండగా ఐసీఎంఆర్ అధికారికంగా ప్రకటించకపోయినా వైద్య మండలి మరియు కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు మాత్రం కరోనా వ్యాధి భారతదేశంలో సామాజిక వ్యక్తి దశకు చేరుకున్నట్లు ప్రకటించేశారు. సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) లేకపోతే దేశంలో ఇన్ని కేసులు రావని అంతర్జాతీయ పత్రికలు కూడా రాశాయి.