Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ఆయన ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలు వచ్చాయా? గిట్టని వారు చేస్తున్న విమర్శలు అంటూ చెడ్డమాటలుగా తీసుకోకుండా సంచలన నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కోవిడ్ పరిస్థితులపై అత్యున్నత సమీక్షా సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు. అయితే, దీనికి ముందు ఉంది అసలు ట్విస్ట్.
సంచలన నిర్ణయం
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 3 లక్షల మార్క్ను కూడా క్రాస్ చేసి.. రోజువారి కోవిడ్ కేసుల్లో ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించింది. మరోవైపు.. ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ల కొరత కూడా రాష్ట్రాలను వేధిస్తోంది.. కేంద్రంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలోషెడ్యూల్ ప్రకారం నేడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పర్యటన రద్దు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో శుక్రవారం జరిగే ఎన్నికల ర్యాలీలకు హాజరు కావడం లేదని .. కరోనా మహమ్మారిపై అత్యున్నత భేటీకి అధ్యక్షత వహించాల్సి ఉందని, దీంతో పశ్చి బెంగాల్ పర్యటనకు వెళ్లడం లేదని సోషల్ మీడియా వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
ఇప్పటికే ఆ పని అయిపోయింది….
ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాను సమీక్షించడానికి ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. దాని ఉత్పత్తిని పెంచడం, పంపిణీ వేగాన్ని పెంచడం మరియు ఆరోగ్య సౌకర్యాలకు ఆక్సిజన్ సహాయాన్ని అందించడానికి వినూత్న మార్గాలను ఉపయోగించడంపై వేగంగా పనిచేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్రాలు ఆదేశించాలని, ఆటంకం ఉన్న సందర్భాల్లో స్థానిక ప్రభుత్వాలు బాధ్యతను తీసుకుని పరిష్కరించాలని కోరారు. బెంగాల్ పర్యటన రద్దు చేసుకుని మరీ.. ఉన్నత స్థాయి భేటీకి ప్రధాని మోడీ సిద్ధం అవుతున్న తరుణంలో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. మరింత కఠినంగా వ్యవహరిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.