చైనా దిగొచ్చింది.లడక్ ఉద్రికత్తలను తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని విస్పష్ట ప్రకటన చేసింది.అయితే ఈ ప్రకటన వెలువడడానికి ముందు కొన్ని ముఖ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత కఠినంగా వ్యవహరించడం వల్లే చైనా తన పంథా మార్చుకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి .భారత్ – చైనా మధ్య లడఖ్ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలసిందే. రెండు దేశాల మిలిటరీకూడా అక్కడ భారీగా సైనికులను, యుధ్ద ట్యాంకులు, విమానాలు మొహరించాయి. చైనా అక్కడ ఎయిర్ బేస్ ను కూడా విస్తరిస్తోందని వార్తలు వచ్చాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య సయోధ్య కోసం మధ్యవర్తిత్వం వహిస్తానని కూడా ట్రంప్ చెప్పారు. కానీ రెండు దేశాలు ఇందుకు అంగీకరించకపోవటం వేరే విషయం.ఈనేపథ్యంలో భారత చైనాల మధ్య శనివారం కీలక చర్చలు జరగాల్సి ఉంది.కానీ చైనా శుక్రవారం నాడే లడక్ లో ఉద్రిక్తలు తొలగిస్తానని ప్రకటన చేసేసింది.భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలి తెలిసిన చైనా మరోవైపు ఈ విషయంలో ట్రంప్ వేలు పెడుతుండటంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ముందే వెనక్కు సర్దుకుందని భావిస్తున్నారు