నరేంద్ర మోడీ ఒక్కసారిగా లడఖ్ పర్యటనకు వెళ్లారు. లడఖ్ లో ఇండియా చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత్ చైనా వారికి షాక్ ల మీద షాక్ లు ఇవ్వడం మొదలు పెట్టింది. మొదటి టిక్ టాక్ సహా చైనా వారికి చెందిన 59 యాప్స్ భారత్ లో బహిష్కరించిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత వారి దేశానికి ఇచ్చిన హైవే కాంట్రాక్టర్లను కూడా రద్దు చేసుకుంది.
ఇక ఇప్పుడు సరిహద్దుల్లోని పరిస్థితులను నిశితంగా పరిశీలించేందుకు ప్రధాన మోడీనే నే స్వయంగా లడక్ కు పర్యటించడం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. నిన్న రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ లడఖ్ పర్యటన వాయిదా పడిన తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఇక్కడికి రావడం విశేషం. ప్రధానితో పాటు సైనిక ఉన్నతాధికారులు లడఖ్ చేరుకున్నారు.
వారితో ఇక్కడి తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఆయన స్వయంగా సైనికులతో మాట్లాడనున్నట్టు సమాచారం. ఇక చైనా వారి పై సైనికులు ఎలాంటి దృక్పథంతో ముందుకు వెళ్ళాలన్న ప్లాన్ తో మోడీ సైనికులతో మరియు చీఫ్ లతో చర్చించనున్నట్లు సమాచారం.