Narendra Modi: ఒక్కో ప్రధానికి ఒక్కో స్టైల్ ఉంటుంది..ఎందరో ప్రధానులు ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ మార్క్ రాజకీయం అప్పట్లో విభిన్నంగా ఉండేది.తల ఎగరేసినవారిని పదవుల నుంచి తప్పించడంలో ఆమె కొత్త పంథా అవలంభించేవారు.అయితే అలాంటి వారి అవసరం పడినప్పుడు మళ్లీ వారినే ఇందిరాగాంధీ అందలమెక్కించేవారు.ఇందుకు ఉదాహరణ మర్రి చెన్నారెడ్డి.రాజకీయంగా ఆయన చురుగ్గా ఉన్నప్పుడే ఇందిరాగాంధీ కొన్ని రాజకీయ కారణాలతో 1974 లో చెన్నారెడ్డిని ఉత్తరప్రదేశ్ గవర్నర్ చేశారు.
అయితే 1978 లో ఆంధ్రప్రదేశ్ లో ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆమెకు మళ్ళీ చెన్నారెడ్డే కావాల్సి వచ్చింది.ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ ఘనవిజయం సాధించగా మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.1980లో చెన్నారెడ్డి పదవీచ్యుతుడయ్యారు.తిరిగి ఇందిరా గాంధీ ఆశీస్సులతో 1982 లో చెన్నారెడ్డి పంజాబ్ గవర్నర్ గా నియమితులయ్యారు. అదే చెన్నారెడ్డి 1989 లో ఇందిర కుమారుడు రాజీవ్ గాంధీ హయాంలో కూడా ఎన్టీఆర్ ప్రభంజనానికి అడ్డుకట్ట వేసి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వేరే విషయం.
Narendra Modi: ఇందిర రాజకీయాన్ని ఫాలో అవుతున్న మోడీ?
ఇప్పుడు ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే తరహాలో ఇందిరాగాంధీ రాజకీయాల్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.తనకు నచ్చని వారిని పదవి నుండి తప్పించి లూప్లైన్లో కి పంపించేయ్యటం మోడీ కి అలవాటుగా మారింది.తెలుగు రాష్ర్టాల్లో విశేషమైన క్రేజ్ కలిగిన వెంకయ్యనాయుడు ని కేంద్ర మంత్రి పదవి నుండి తీసేసి అలంకారప్రాయమైన ఉపరాష్ట్రపతి పదవికి మోడీ పరిమితం చేయటం తెలిసిందే.అలాగే ఎన్డీయే మొదటి టెర్మ్ లో బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రిగా తప్పించి గవర్నర్ గా నియమించారు. తాజా రాజకీయ పరిణామాలలోఈమధ్య జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవులు కోల్పోయిన ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులకు గవర్నర్ పోస్టులు లభించాయి.
ఆ ఇద్దరూ ఎవరంటే?
కేంద్ర మంత్రి మండలి విస్తరణకు ఒకరోజు ముందే తన క్యాబినెట్లోని థావర్ చంద్ గహ్లాత్ కు గవర్నర్ పదవి ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. పరోక్షంగా ఆయన మంత్రి పదవి ఊడిందనే సంకేతం ఆ విధంగా ప్రధానిచ్చారు.ఇక విస్తరణలో పదవి కోల్పోయిన ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని తాజాగా తమిళనాడు గవర్నర్ గా నియమించారు.పోతే ఇంకో కేంద్ర తాజా మాజీ మంత్రి సదానందగౌడను కూడా కర్నాటక సీఎంగా నియమించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.అదే జరిగితే ప్రస్తుత కర్నాటక సీఎం యడ్యూరప్ప ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా రాబోతున్నారన్న వదంతులు వినిపిస్తున్నాయి.ఇది మోడీ నయా రాజకీయంగా కనిపిస్తోంది.