Mohan babu: సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని తన ప్రతిష్టను దిగజార్చేలా బూతుల రూపంలో వీడియోలు క్రియేట్ చేస్తూ విమర్శిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామెంట్ల రూపంలో అదే రీతిలో ఇంకా రకరకాలుగా తనను టార్గెట్ చేసుకుని మరి వ్యక్తిగతంగా తిట్టడం మే కాక పోస్టులు పెడుతున్నారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో తన ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని సూచించారు. మోహన్ బాబు చేసిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేస్ ఫైల్ చేయడం మాత్రమే కాక.. దర్యాప్తు కూడా స్టార్ట్ చేసేసారు. మోహన్ బాబు తరఫున ఆయన లీగల్ అడ్వైజర్ న్యాయవాది సంజయ్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పొలిటికల్ మోజో అనే యూట్యూబ్ ఛానల్ ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు.. సంజయ్ చెప్పుకొచ్చారు.
Read more: Rajinikanth-Mohan Babu: రజినీ-మోహన్ బాబు.. ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్’..!
ఇదిలావుంటే ఇటీవల సోషల్ మీడియాలో చాలా యూట్యూబ్ చానల్స్ అదే రీతిలో కొన్ని వెబ్ సైట్స్ హీరోలను అదే రీతిలో రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్నాయి. పెద్దపెద్ద సెలబ్రిటీలను టార్గెట్ చేసి వ్యూస్ లైకుల కోసం ఈ రకంగా వ్యవహరిస్తున్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి. చాలావరకు కరోనా వచ్చాక సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై అధికంగా ఉండటంతో .. ఇటువంటి ఘాతుకాలకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!