టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అటు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇటు రాజకీయాల్లోనూ మరియు ఉన్నత విద్యాసంస్థల నిర్వహణలోనూ ముఖ్య భూమిక పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థాపించిన విద్యానికేతన్ విద్యాసంస్థలు రాష్ట్రంలోనే అగ్రగామిగా వెలుగొందుతున్నాయి. అయితే తాజాగా జాతీయ స్థాయిలో విద్యా సంస్థలకు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించిన ఈ ర్యాంకుల్లో మోహన్ బాబు కు చెందిన తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీ కి 184 ర్యాంక్ లభించింది. విద్యార్థుల తాజా ప్రతిభా పాటవాలు, ప్రదర్శన మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ నిర్వహణ ఇటువంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని ర్యాంకులను వెల్లడిస్తారు.
దీనిపై శ్రీ విద్యానికేతన్ సంస్థల అధినేత ప్రముఖ నటుడు మోహన్ బాబు స్పందించి ముందుగా విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీ కుటుంబానికి తన శుభాభినందనలు తెలిపారు. జాతీయస్థాయిలో ఇంత మంచి ర్యాంకు రావడం పట్ల తీవ్రమైన హర్షం వ్యక్తం చేసిన మోహన్ బాబు తమ సంస్థ జాతీయ స్థాయిలో 184 వ ర్యాంకులో నిలబడడం ఏమీ తక్కువ విషయం కాదని చెప్పిన ఆయన ఈ ప్రయాణంలో తనకి తోడుగా ఉన్న అందరికీ జేజేలు అంటూ వ్యాఖ్యానించారు.