Mohan raja మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 153 వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ కథ మెగాస్టార్ కి విపరీతంగా నచ్చడంతో ఎంతో ఆసక్తిగా ఈ సినిమా చేసేందుకు చిరు రెడీ అనడంతో చరణ్ రీమేక్ రైట్స్ ని కొన్నాడు. ఇక ఈ సినిమా బాధ్యతలు ముందు సాహో ఫేం సుజీత్ కి అప్పగించారు. మూడు నెలలు కూడా సుజీత్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాడు. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టు మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ మార్చడంలో మెగాస్టార్ ని మెప్పించలేకపోయాడు.
ఆ తర్వాత మెగాస్టార్ కి రెండు భారీ హిట్స్ ఇచ్చిన వి.వి.వినాయక్ వచ్చి చేరాడు. వినాయక్ కూడా మెగాస్టార్ ని తృప్తి పరచలేకపోయాడు. దాంతో ఇక ఈ ప్రాజెక్ట్ పక్కకి పెట్టినట్టే అని అందరూ మాట్లాడుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్లోకి తమిళ దర్శకుడు మోహన్ రాజా ని ఎంటర్ చేసి భారీ షాకిచ్చారు. జనవరిలో ఘనంగా ప్రారంభోత్సవం జరిగిన ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి – మార్చ్ నెలలో ప్రారంభం అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో డిలే అయింది.
Mohan raja : మోహన్ రాజాకి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
తాజా సమాచారం ప్రకారం లూసీఫర్ తెలుగు రీమేక్ స్క్రిప్ట్ పక్కాగా రెడీ అయిందట. మెగాస్టార్ విని వందకి వంద శాతం తృప్తి చెంది మోహన్ రాజాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలో సెట్స్ మీదకి వెళదామని ..షెడ్యూల్ ప్లాన్ చేయమని చెప్పారట. దాంతో ఏప్రిల్ రెండవ వారం నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రాబోతోందని లేటెస్ట్ అప్డేట్. ఇక త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ సహా ఇతర నటీ నటులను ప్రకటించనున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే ఈ ఏడాదిలోనే రిలీజ్ కూడా చేస్తారని తెలుస్తోంది.