Street Vendors: వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కొత్త కొత్త స్కీములను ప్రవేశపెడుతోంది. ఆ స్కీములను సరిగ్గా వాడుకుని వ్యాపారులు తమ బిజినెస్ ను డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ స్కీమును ఎలా అప్లై చేసుకోవాలో? తెలియక చాలా మంది అర్హత ఉన్న వీధి వ్యాపారులు నష్టపోతున్నారు. ప్రయోజనాలు కూడా కొందరికి సరిగ్గా తెలియడం లేదు.
Money: పీఎం స్వనిధి..
వీధి వ్యాపారుల కోసం కేంద్ర కొత్తగా ప్రవేశపెట్టిన పథకం పీఎం స్వనిధి పథకం(PM Svanidhi). ఈ పథకానికి అర్హులైన వీధి వ్యాపారులకు 20 వేల రూపాయల వరకు ప్రయోజనాలను ప్రభుత్వం అందజేస్తోంది. ఈ ప్రయోజనాలను పొందేందుకు మీరు సింపుల్ గా చేయాల్సిందల్లా ఆ పథకానికి అప్లై చేసుకోవడమే. ఈ పథకంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. మీరు కనుక ఈ పథకం ద్వారా లోన్ తీసుకుని కరెక్ట్ టైంలో డబ్బులు తిరిగి కడితే మీకు వడ్డీ రాయితీ లభిస్తుంది. కావున వీధి వ్యాపారులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో తీసుకున్న లోన్ కు ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువగానే ఉండనుంది. వడ్డీ రేటులో దాదాపు 7 శాతం వరకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
మార్చి 31 చివరి తేదీ..
ఈ పథకానికి మార్చి 31 2022 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ రుణాలను పొందేందుకు ప్రభుత్వం ఒక కండీషన్ పెట్టింది. ఈ రుణానికి అప్లై చేసే వారు 2020 మార్చి 24 కన్నా ముందు ఎటువంటి బ్యాంకు రుణాలను పెండింగ్ లో ఉంచరాదు. ఈ నియమాన్ని బట్టే ప్రభుత్వం అప్లై చేసుకున్న వీధి వ్యాపారుల్లో ఎవరు అర్హులనే విషయం తేలుస్తుంది. వీధి వ్యాపారులు తమ దగ్గరున్న నెట్ సెంటర్ కి వెళ్లి pmsvanidhi.mohua.gov.in అనే వెబ్ సైట్ లో లాగిన్ అయి రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?