ఇన్సూరెన్స్ పాలసీ అనేది మరణ అనంతరం కుటుంబం పొందే ఆర్థిక సహకారం మాత్రమే కాదు. బ్రతికుండాగానే ఆర్థికంగా అండగా నిలిచేది కూడా. భారత దిగ్గజ ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీ తనదైన స్టైల్లో దూసుకుపోతూ.. అనేక వినూత్న పాలసీలను తీసుకువస్తున్నది. దీంతో అనేక ప్రయివేటు బీమా సంస్థలు ఈ రంగంలోకి వచ్చినా తన హవాను కొనసాగిస్తోంది.
దీంతో వినియోగదారుల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఎల్ఐసీ.. తన కస్టమర్ల కోసం అనేక వినూత్నపాలసీలను తీసుకువస్తున్నది. అయితే, మీరు పాలసీ తీసుకోవాలనుకుంటే.. మీకు ఒక అద్ధిరిపోయే సరికొత్త పాలసీని తీసుకువచ్చింది ఎల్ఐసీ. అతి తక్కువ ప్రీమీయంతోనే మంచి రాబడిని పొందడంతో పాటు మరిన్ని అనేక లాభాలను పొందవచ్చు. దీనికి తోడు ఇన్సూరెన్స్ కవరేజీ కూడా లభిస్తోంది.
ఇన్నిలాభాలు కల్పిస్తున్న ఎల్ఐసీ పాలసీయే “న్యూ జీవన్ ఆనంద్ పాలసీ ప్లస్”. ఈ పాలసీ తో దాదాపు 30 లక్షల ప్రయోజనాలు లభిస్తాయి. ఎల్ఐసీ అందిస్తున్న ఈ పాలసీని రూ. 5 లక్షలు మొత్తానికి తీసుకుంటే నెలకు రూ.1,150 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రోజుకూ సగటున కేవలం 40 రూపాయలు మాత్రమే జమ చేయాల్సి ఉంటుందన్నమాట. 35 సంవత్సరాల ఈ పాలసీ సమయం ముగియగానే పాలసీ మొత్తంతో పాటు బోనస్లు సహా అదనంగా మరింత బోనస్ కూడా లభిస్తుంది. అంటే దాదాపు 25 లక్షల రూపాయాలు మనం తీసుకోవచ్చు.
అయితే, డబ్బులు తీసుకోవడంతో పాలసీ ముగిసిపోతుంది అనుకోకండి. మిగిలిన ఐదు లక్షల రూపాయల బీమా కవరేజ్ కొనసాగుతూనే ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే 30 లక్షల ప్రయోజనాలు ఈ పాలసీతో లభిస్తున్నాయి. ఈ పాలసీని తీసుకోవడానికి కనీసం 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులుగా ఎల్ఐసీ నిబంధనలు పెట్టింది. అలాగే, పాలసీ తీసుకోవడానికి గరిష్ట వయస్సును 55 సంత్సరాలుగా నిర్ణయించింది. ఈ పాలసీని 15 నుంచి 35 సంవత్సరాల కాలపరిమితితో తీసుకునే అవకాశం కూడా కల్పించింది. అంటే ఈ సమయంలో పాలసీ సొమ్మును తీసుకున్నప్పటికీ.. బీమా కవరేజ్ కొనసాగుతూనే ఉంటుంది.