క్రైస్తవులకు చాలా ముఖ్యమయిన పండగ క్రిస్మస్. ఈ పండగనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు సంబరాలు చేసుకుంటారు. ఇదొక పెద్ద వేడుక. ఈ క్రిస్మస్ పండగరోజు ప్రధాన ఆకర్షణగా నిలిచేవి క్రిస్మస్ ట్రీ మరియు శాంతా క్లాస్. శాంతా క్లాస్ కు పిల్లలలంటే ఇష్టమట అందుకే క్రిస్మస్ రోజున ఆయన బహమతులు ఇస్తుంటాడు అని మనం వింటూవుంటాం. పిల్లలకు ఇష్టమయిన చాక్లెట్స్, కేక్స్, మరియు ఐస్క్రీమ్ లు ఆయన పంచుతుంటాడు.
సహజంగా అందరిలోనూ ఉండే సందేహం ఏమిటంటే ఈ క్రిస్మస్ తాతా ఎవరు? ఆయన నిజంగానే ఉన్నాడా అని. ఈ క్రిస్మస్ రోజున శాంతా క్లాస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. కానీ ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమనగా కొంతమంది క్రిస్మస్ తాతయ్య అని ఎవరూ ఉండరని , అదొక ఊహాజనిత పాత్ర అని కొట్టిపారేస్తుంటారు. అయితే చరిత్రకారులు మాత్రం శాంతా క్లాస్ ఒకప్పుడు నిజంగానే ఉండాన్నడని అంటున్నారు. ఇటీవలే చరిత్రకారులు టర్కీలో శాంతా క్లాస్ సమాధిని కూడా గుర్తించారు. ఈ సమాధి దక్షిణ టర్కీ అంటాల్యా ప్రొవిన్స్లోని డేమేరే లో ఉన్న చర్చి కింద శాంతాక్లాజ్ సమాధిని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు.
చరిత్రకారుల కథనం ప్రకారం శాంతా క్లాజ్ అక్కడే పుట్టారట మరియు వారు దానికి సాక్ష్యం కూడా చూపిస్తున్నారు. అదే చర్చిలో దొరికిన కొన్ని గ్రంథాలఅట. శాంతాక్లాజ్ క్రీస్తుశకం 343లో మరణించినట్టు తెలుస్తుంది. అయితే ఆయన పుట్టుక జీవిత విశేషాలకు సంబంధించి మరింత పరిశోధన సాగాల్సిఉంది. ప్రస్తుతం గ్రంథాల్లో ఉన్న వివరాల ప్రకారం శాంతక్లాజ్ కు చిన్న పిల్లలంటే చాలా ఇష్టమట. తన జీవితాన్ని చిన్నపిల్లల కోసం ధారబోసాడట.చిన్నపిల్లలకు బహుమతులు ఇవ్వడానికి తన ఆస్తులను అమ్మి మరీ పంచేవాడట. అంతేకాకుండా తన ఆదాయాన్ని కూడా చిన్నపిల్లల కోసమే వెచ్చించేవాడట. శాంతాక్లాజ్ పిల్లలకు బహుమతులు ఇవ్వడానికి వివిధ రూపాల్లో వస్తాడని క్రైస్తవుల నమ్ముతుంటారు.