కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యి ఎనలేని పాపులారిటీని దక్కించుకున్నారు శ్వేతాబసుప్రసాద్. శ్వేతా నేటితో 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరం లోకి అడుగు పెట్టారు.
శ్వేతాబసుప్రసాద్ జనవరి 11, 1991లో బీహార్ లోని జంషెడ్పూర్ లో జన్మించారు. ఆమె తన కుటుంబంతో కలిసి కొన్నేళ్ల తర్వాత ముంబై నగరానికి వచ్చి స్థిరపడ్డారు. శ్వేత మాస్ మీడియా, జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ఆమె “ది ఇండియన్ ఎక్స్ప్రెస్” డైలీ న్యూస్ పేపర్ కి కాలమ్స్ రాసేవారు. ఆ తర్వాత అనుకోకుండా సెక్స్ రాకెట్లో ఈమె కూడా పట్టుబడటం సంచలనంగా మారింది. ఆ వెంటనే బాలీవుడ్ వెళ్లి అక్కడ సినిమాలు చేసుకుంది శ్వేతా బసు ప్రసాద్. ఈ అందాల తార, ఓ ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్ ను డిసెంబర్ 18, 2018 లో వివాహం చేసుకున్నారు. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అంటే డిసెంబర్ 10, 2019 వ తేదీన పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని సోషల్ మీడియా వేదికగా శ్వేతా వెల్లడించారు. ఆ
శ్వేతా బసు ప్రసాద్ తన చిన్న వయసులోనే నటనారంగంలో అడుగు పెట్టారు. ముందుగా బుల్లితెరపై తెరంగేట్రం చేసి ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటించడం ప్రారంభించారు. శ్వేతా బసు ప్రసాద్ నటించిన మొదటి సినిమా, 2002వ సంవత్సరంలో విడుదలైన మక్దే. శ్వేతా బసు ప్రసాద్ కి ఈ సినిమాలోని ఆమె నటనకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ లభించింది.
కొత్త బంగారులోకం సినిమా ద్వారా శ్వేతా బసు ప్రసాద్ 2008 లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇప్పటి వరకు ఆమె మొత్తం 8 సినిమాల్లో నటించారు. ఆమె ఇప్పటికీ వెబ్ సిరీస్, సినిమాల్లో, షార్ట్ ఫిల్మ్ లలో నటిస్తూన్నారు.