వ్యాపారం చేసుకొనేందుకు మనదేశంలోకి వచ్చిన బ్రిటిషర్లు ఇక్కడే స్థిరపడి చివరకు వారి మతమయిన క్రైస్తవ మతాన్ని ఇక్కడి ప్రజలకు బోధించారు. అయితే బ్రిటిషర్లు మన దేశానికీ రావడానికి వెనుక గల కారణం వ్యాపారాభివృద్ధి తో పాటు మతవ్యాప్తి కూడా అన్నది బహిరంగ రహస్యమే. అప్పటికే మనదేశంలో మనుగడలో ఉన్న హిందూమతంలోని లోటుపాట్లను క్రైస్తవ మిషనరీలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాయి. అందుకే బ్రిటిషర్లు నిమ్నవర్గాల వాళ్లనే టార్గెట్ గా చేసుకున్నారు. క్రైస్తవ మతం పట్ల ఎక్కువ మక్కువ చూపింది కూడా నిమ్నవర్గాలే.
నిజాం నవాబు పాలన వల్ల తెలంగాణ రాష్ట్రం లో క్రైస్తవ మతం విస్తరించలేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం క్రైస్తవ మతం చాలా వేగంగా వ్యాప్తి చెందింది. చాలామంది లో అసలు క్రైస్తవులు పవిత్ర గ్రంధంగా భావించే బైబిల్ ను తెలుగులో తొలిసారి ఎప్పుడు, ఎవరు అనువదించారు? అందుకు ఎవరెవరు సహకరించారు అన్న సందేహాలు ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్టణం తీరప్రాంతం అవ్వడం వలన బ్రిటిషర్లు ఆ ప్రాంతాన్ని తమ వ్యాపారాభివృద్ధి కోసం వాణిజ్య కేంద్రంగా మలుచుకున్నారు. మరియు వారు తమ వ్యాపారాభివృద్ధి కోసమే క్రైస్తవ మతవ్యాప్తికి పూనుకున్నారు. బైబిల్ ను తొలిసారిగా తెలుగులోకి విశాఖ పట్టణంలో అనువదించారు. అక్కడున్న జమిందారు లే బైబిల్ ను తెలుగులోకి అనువదించడానికి సహకరించారట. అనువదించిన వ్యక్తిపేరు ‘అనంద్ సునాద్’.
1805 వ సంవత్సరంలో అగస్టస్ డెస్ గ్రాంజెస్ జార్జ్ క్రాన్ అనే క్రైస్తవ మిషనరీల నిర్వహాకులు బైబిల్ ను తెలుగులోకి అనువదించాలని నిర్ణయించుకున్నారు. వారు అప్పుడు విశాఖపట్టణంలోని టిప్పు సుల్తాను సంస్థానంలో ఉన్నత ఉద్యోగిగా ఉన్న సుబ్బారాయర్ సాయంతో బైబిల్ను తెలుగులో అనువదించాలనుకున్నారు. అయితే, ఇందుకు సుబ్బరాయర్ కూడా ఒప్పుకున్నాడు. అనువదించే ముందుగా అతడు తన పేరును ఆనంద్ సునాద్ గా మార్చుకొని క్రైస్తవం స్వీకరించాడు. ఆ తర్వాత బైబిల్ అనువదించాడు.. అయితే ఆ రోజుల్లో అనేక కారణాల వల్ల నిమ్నవర్గాల వారితో పాటు జమిందార్లు మరియు అగ్రవర్ణాల వాళ్లు కూడా క్రైస్తవాన్ని స్వీకరించేవారు.