తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి ఆ పార్టీలో నాయకులకు టెన్షన్ పుట్టిస్తోంది. క్షణక్షణానికి కొత్త పేర్లు తెరపైకి వస్తున్న తరుణంలో పార్టీలో సరికొత్త వాతావరణం నాయకుల మధ్య నెలకొంటుంది. ఈ క్రమంలో మొదటి నుండి రేవంత్ రెడ్డి పేరు వినబడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు వ్యతిరేకిస్తూ ఉన్నారు.
ఇలాంటి తరుణంలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే కాంగ్రెస్ లో ఎవరూ ఊహించని విధంగా రేవంత్ రెడ్డికి ఊహించని ఝలక్ ఇచ్చినట్లు తెలంగాణ రాజకీయ వర్గాలలో టాక్ వస్తోంది. టీ కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఒప్పించిన గాని రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి అందని ద్రాక్షగానే ఉంది.
మొదటిలో ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి ఎన్నికల ముందు బ్రేక్ పడగా తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు దుబ్బాక ఎన్నికలు వచ్చి అడ్డుపడటం జరిగాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు రావడంతో మరో మూడు నెలలపాటు పీసీసీ చీఫ్ పదవి ఎవరికీ వరించింది అన్న దాని విషయంలో క్లారిటీ ఉండదని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఠాగూర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ పదవి ప్రకటించే విషయంలో మరో మూడు నెలలు వాయిదా పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద మరో ఆరు నెలల పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదని పేర్కొంటున్నారు.