Krishna River: కృష్ణానదికి ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు ఇసుక రీచ్ లో వందకు పైగా ఇసుక లారీలు చిక్కుకుపోయాయి. అకస్మాత్తుగా వరద వరద రావడంతో రహదారి కూడా కొంత మేర దెబ్బతిన్నది. దీంతో నదిలో ఇసుక కోసం వెళ్లిన పెద్ద సంఖ్యలో లారీలు తిరిగి రాలేని పరిస్థితితో అక్కడే నిలిచిపోయాయి. దీంతో లారీ యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
సమాచారం తెలియడంతో పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. వరదలో చిక్కుకున్న లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను పడవలో ఒడ్డుకు చేరుస్తున్నారు. వరదలో చిక్కుకున్న లారీలను వరద ప్రవాహం తగ్గిన తర్వాత బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని అధికారులు చెబుతున్నారు.