అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన నాలుగో చిత్రంలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. లాక్ డౌన్ కు ముందే ఈ చిత్ర మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది.
గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు ఒక పోస్టర్ ను విడుదల చేసి ప్రమోషన్స్ షురూ చేసింది. మా క్వారంటైన్ లుక్ ఇదే అంటూ అఖిల్, పూజ హెగ్డే ఉన్న ఫోటోను విడుదల చేసింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంక్రాంతి 2021కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉంది.