Ghost haunted: ప్రపంచ రైల్వే నెట్వర్క్ లో భారతదేశ రైల్వే నెట్వర్క్ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ గా పేరు పొందింది. అయితే మన దేశంలో కొన్ని ప్రదేశాలలో రైల్వే స్టేషన్ లలో దెయ్యాలు ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. కొన్ని రైల్వే స్టేషన్ లలో అయితే పగలు జనాలతో రద్దీగా ఉన్నప్పటికీ రాత్రి అయ్యేసరికి ఒక్క మనిషి కూడా కనిపించడు. రాత్రిళ్ళు ఆ ప్రదేశాలలో దెయ్యాలు తిరిగుతాయని వాటిని తాము చూశామని స్థానికులు చెబుతూ ఉంటారు. అయితే ఇంతకీ ఇండియా లోని ఏ ఏ రైల్వే స్టేషన్ లు ఘోస్ట్ హూంటెడ్ గా పేరుపొందాయో తెలుసా?
మొదటిగా కోల్కత్తా లోని రవీంద్ర సరోబార్ మెట్రో స్టేషన్…. ఈ మెట్రో స్టేషన్ పగలంతా జనాలతో చాలా రద్దీగా ఉంటుంది. కానీ రాత్రి అయితే ఇక్కడ ఎవ్వరూ కనిపించరు. ప్రయాణికులు రాత్రి వేళలో ఇక్కడికి రావడానికి అస్సలు సాహసించరు. అందుకు కారణం ఏమిటంటే ఈ మెట్రో స్టేషన్ లో రాత్రి వేళ ఏవేవో వింత ఆకారాలు మరియు భీకరమయిన ఏడుపులు వినిపిస్తాయట. అందుకే ప్రజలు రాత్రివేళ ఆ మెట్రో స్టేషన్ కు వెళ్ళడానికి అస్సలు సాహసించరు.
ఇక రెండవది…. పశ్చిమ బెంగాల్ లోని బెగున్ కొడోర్ స్టేషన్…. పశ్చిమ బెంగాల్ లోని ఈ రైల్వే స్టేషన్ లో రాత్రి వేళలో ఓ మహిళ తెల్ల చీర కట్టుకుని తిరుగుతుందని తాము ప్రత్యక్షంగా చూశామని స్థానికులు చెబుతున్నారు. ఆ స్టేషన్ లో చాలా మంది ఉద్యోగుల మరణానికి కారణం కూడా ఆ ఆత్మేనని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. రైల్వే పట్టాల మీద అలా నడుచుకుంటూ ఆ ఆత్మ వెళ్లడాన్ని చాలా మంది చూశామని చెబుతున్నారు.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.