Twitter: మన దేశంలో లాక్ డౌన్ సమయంలో ఎక్కువమంది అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫాంలతో పోలిస్తే ట్విట్టర్ నే ఎక్కువగా ఉపయోగించారట. అందులోనూ మహిళలే ఈ సమయంలో ట్విటర్ ను ఎక్కువగా ఉపయోగించారట. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాజాగా ట్విట్టర్ ఒక ఆసక్తికర సర్వే నిర్వహించగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే లో భారతీయ మహిళలు ట్విట్టర్లో ఎక్కువగా ఏ విషయాలపై చర్చించారనే విషయంపై జరిగినది. ఈ సర్వే ఫలితాలను 2019 ఫిబ్రవరి నుండి 2021 ఫిబ్రవరి వరకు ఉన్నా డేటా ను ఆధారం చేసుకుని విడుదల చేశారు.
మొత్తం ఈ సర్వే 10 నగరాలలోని 700 మంది మహిళలు మరియు వారు చేసిన 5,22,992 ట్వీట్లపై జరిగినది. అయితే ట్విటర్ సర్వేలో తెలిసింది ఏమిటంటే ఈ లాక్డౌన్ సమయంలో మహిళలు ఎక్కువగా తొమ్మిది ముఖ్య అంశాలపై చర్చ జరిపారట.
ఇక సర్వే ఫలితలు ఇలా ఉన్నాయి.. 30% మహిళలు ఎక్కువగా ఫ్యాషన్పై, 28% మహిళలు పుస్తకాలపై, 25% మంది అందంపై, 21% మంది సినిమాలపై, 18% మంది మహిళలు ఆహారంపై, 17% మంది స్త్రీలు సాహిత్యంపై, 18% మంది మ్యూజిక్ పై, టెక్నాలజీపై, 17% మంది కళల పై, అలాగే 14% మంది క్రీడల గురించి చర్చించారట. అంతేకాకుండా, టాప్ సెలబ్రేటరీ మూమెంట్స్పై 14.5%, మరియు దేశశంలో సామాజిక మార్పు పై 8.7% మంది మహిళలు చర్చించారని ట్విటర్ పేర్కొంది.
అయితే ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, మనీష్ మహేశ్వరి, ఈ సర్వే ఫలితాలపై మాట్లాడుతూ ‘‘ట్విటర్ లో భారతీయ మహిళలు ఎక్కువగా ఏ ఏ విషయాల గురించి చర్చిస్తున్నారనే విషయంపై మేము ఓ సర్వే నిర్వహించాం. ఈ సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. ముఖ్యంగా భారతీయ మహిళలు ఎటువంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్చ గా తమ ఆలోచనలను మరియు అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ట్విటర్ సరైన వేదికగా భావిస్తున్నారని అర్ధం అయ్యింది.” అని అన్నారు ఆయన.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.