మలయాళం ఇండస్ట్రీ లో నటి మాల పార్వతీ అందరికీ సుపరిచితురాలు. అయితే ఆమె కొడుకు అనంత్ కృష్ణన్ ఇండస్ట్రీకి చెందిన ట్రాన్స్ జెండర్ మేకప్ ఆర్టిస్ట్ సీమా వినీత్తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంలో వెంటనే తల్లి మాల పార్వతీ రంగంలోకి దిగి ట్రాన్స్జెండర్ మేకప్ ఆర్టిస్ట్ సీమా వినీత్తో వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడటం జరిగింది. దీంతో ట్రాన్స్జెండర్ మేకప్ ఆర్టిస్ట్ సీమా అవును మీ కొడుకు చేస్తున్నది నిజమే అని ఆమెకు తెలిపిందట.
అంతేకాకుండా అర్ధరాత్రి పూట అసభ్యకరమైన ఫోటోలు వాట్సాప్ మెసేజ్ లు చేస్తున్నాడని…అసభ్యకరమైన సంభాషణలతో అర్ధరాత్రి పూట మెసేజ్ లు పెడుతున్నాడని తల్లి మాల పార్వతీ తో తెలిపింది. దీంతో వెంటనే మాల పార్వతీ ట్రాన్స్ జెండర్ ఆర్టిస్ట్ కి క్షమాపణలు చెప్పింది. వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో జనాల్లో కి వేరేలాగా వెళుతుంది అనే ఆలోచనతో, అంతటితో ఆగకుండా కొడుకు మీద కేసు కూడా పెట్టింది కన్నతల్లి మాల పార్వతీ. విచారణలో అన్ని బయటపడతాయని కన్న కొడుకు అయినా సరే నేను మాత్రం సీమకే గట్టి సపోర్ట్ ఇస్తానని.. ట్రాన్స్ జెండర్లపై చూపించాల్సింది జాలి కాదని.. వారికి మేమున్నామన్న గట్టి నమ్మకాన్ని ఇవ్వాలని మలయాళీ నటి మాల పార్వతీ చెప్పుకొచ్చింది.