సర్కారు వారి పాట.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న లేటెస్ట్ సినిమా. మహేష్ బాబు కెరీర్ లో రాబోయో ఈ 27 వ సినిమాకి గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ..14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
యూనివర్సల్ కాన్సెప్ట్ అయిన బ్యాంక్ లో జరుగుతున్న మోసాలు, నేరాలు అన్న బ్యాక్ డ్రాప్ ని ఈ సినిమా కథ అని తెలుస్తుంది. మహేష్ బాబు ఆర్దిక నేరస్థుడిగా కనిపించబోతుండగా… పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. మహేష్ సరసన కీర్తి సురేష్, బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.
ఇక ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట నుంచి ఫ్యాన్స్ కి భారీ గిఫ్ట్ ఇచ్చారు మహేష్ టీం. తాజాగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. గత మూడు రోజులుగా ఈ సర్ప్రైజ్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. తాగాగా రిలీజైన సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ తో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలవబోతుండగా మహేష్ బాబు, ఎస్ ఎస్ థమన్ కాంబినేషన్ 7 ఏళ్ళ తర్వాత రిపీటవుతుంది.
Hungama Shuru ?
Here’s the electrifying Motion Poster of #SarkaruVaariPaata ?https://t.co/hI9QiSnYQv#HBDMaheshBabu ?Super ⭐ @urstrulyMahesh @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents
— Mythri Movie Makers (@MythriOfficial) August 9, 2020