హైదరాబాద్, జనవరి 23: అయప్ప భక్తుల ఆగడాలు అదుపుతప్పుతున్నాయి. సేవ్ శబరిమల బృందం బుధవారం హైదారాబాద్లోని ధర్నా చౌక్లో కవరేజ్కోసం వచ్చిన మోజో టివి ప్రతినిధులపైన దాడికి పాల్పడ్డారు. శబరిమలలో మహిళల ప్రవేశంపై వార్తలను ప్రసారం చేశారని ఆరోపిస్తూ ప్రతినిధులపై దాడి చేశారు.
ఈ దాడిని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ హిందూ ధార్మిక సంఘాలు, ఆర్ఎస్ఎస్ అయ్యప్పభక్తులు కలసి ఇందిరాపార్కు వద్ద శబరిమల పవిత్రతను కాపాడాలని కోరుతూ మహా ఉపవాస దీక్ష చేపట్టారు.
సుప్రీం కోర్టు తన తీర్పును మార్పు చేసేవరకు ఆందోళన ఉదృతం చేస్తామని అయప్ప భక్తులు తెలిపారు. కేరళలో వలె మహిళలతో కలసి రాజధానిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వారు వెల్లడించారు.