Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) తెలుగు దేశం పార్టీని(TDP) వీడుతున్నట్లు మొన్నటిదాకా ఏపీ మీడియా సర్కిల్స్ లో వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అంతమాత్రమే కాకుండా తన పార్టీ ఆఫీస్ కార్యాలయం నుండి చంద్రబాబు నాయుడు(Chandrababu) ఫోటోలతో పాటు మరికొంతమంది తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు ఫోటోలను తొలగించినట్లు కూడా వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో తెలుగుదేశం పార్టీకి ఇక కేశినేని నాని గుడ్ బై చెప్పేసినట్లే అని టాక్ నడిచింది.
ముఖ్యంగా విజయవాడ(Vijayawada) నగరపాలక ఎన్నికలలో సొంత పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు తనకు వ్యతిరేకంగా మారిన గాని చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన గాని వాళ్ళ పై చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడంతో.. కేశినేని నాని పార్టీ హై కమాండ్ తీరుపై అలక చెందినట్లు అందువల్లే.. పార్టీ మారటానికి రెడీ అయినట్లు.. టాప్ గట్టిగా నడిచింది. ఇటువంటి తరుణంలో తాజాగా చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష కార్యక్రమంలో… మద్దతు తెలుపుతూ.. కేశినేని నాని హాజరయ్యారు. చాలాసేపు వేదికపై చంద్రబాబు పక్కనే కూర్చుని మాట్లాడటం జరిగింది. అనంతరం వైఎస్ జగన్ పై మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో వచ్చి దాడి చేయడం కాదు.. నువ్వానేనా అన్నట్టుగా డైరెక్ట్ ఫైట్. ఏ గ్రౌండ్లో తేల్చుకుందామో చెప్పండి. డే టైమింగ్ చెబితే డైరెక్ట్ ఫైట్ చేసుకుందాం. మేము రెడీ ఒకేసారి తేల్చుకుందాం అంటూ ఛాలెంజ్ విసిరారు. సీఎం ఏం జగన్ ని సంతోషపెట్టడానికి కొంతమంది గుండాయిజం చేస్తున్నారని.. అదే రీతిలో గత పాలనా ఇప్పటి పాలన రెండిటినీ ప్రజలు బేరీజు వేసుకోవాలి అని సూచించారు. జగన్ ప్రభుత్వం తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏకం చేస్తూ పార్టీని బలపరిచే రీతిలో
దీంతో కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలకు.. తన తాజా లేటెస్ట్ ఎంట్రీ తో విజయవాడ ఎంపీ కేశినేని నాని చెక్ పెట్టినట్లు అయింది. ఈ పరిణామం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా తాజాగా చేపట్టిన చంద్రబాబు నిరసన దీక్ష తెలుగుదేశం పార్టీ తేలిక నాయకులను ఏకం చేస్తూ పార్టీని బలపరిచే రీతిలో ఉన్నట్టు తెలుస్తోంది. నిరసన దీక్ష అనంతరం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి… కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి.. రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలపై దాడులు విషయం గురించి… ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.