తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన రాజకీయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయనను మీడియా కలవగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ లో చేరడం, బీజేపీ తరపున మునుగోడులో పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో సోదరుడు రాజగోపాల్ కు సహకరించాలని వెంకటరెడ్డి మాట్లాడినట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ సమయంలోనే విదేశీ పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ అధిష్టానానికి సమాధానం పంపారు.
అయితే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యహహారాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రచారంలో పాల్గొనలేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లోనూ పాల్గొనలేదు. రేవంత్ రెడ్డి నాయకత్వంపై తీవ్ర విముఖతతో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా ఉన్న తరుణంలో ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లుగా చెప్పారు వెంకటరెడ్డి.
నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకువచ్చిన వ్యక్తిని తానేనని చెప్పిన వెంకటరెడ్డి, రాబోయే ఎన్నికల వరకూ నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానని అన్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందు ఏ పార్టీలో కొనసాగాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అదే విధంగా వైఎస్ షర్మల ఘటనపైనా మాట్లాడుతూ ఆ ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. దానిని అందరూ ఖండించాలని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
Suicide: ఏపిలో తహశీల్దార్ ఆత్మహత్య .. కారణం అందేనా..?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?