Raghu Rama: సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణం రాజు డిశ్చార్జ్ అయ్యారు. ఆయన అక్కడ నుండి బేగంపేట విమానాశ్రయం నుండి డిల్లీకి బయలుదేరారు. ఇటవల ఆయనను రాజద్రోహం తదితర నేరాల కింద ఏపి సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Read More: Fact Check Vaccination: వాక్సిన్ వేసుకుంటే చనిపోతారు.. ఈ వార్త అవాస్తవమట..!!
సీఐడీ విచారణ సమయంలో తనపై దాడి జరిగిందంటూ రఘురామకృష్ణం రాజు ఆరోపణ చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. హైకోర్టు ఆదేశాలకు మేరకు తొలుత జీజీహెచ్ లో, ఆ తరువాత సుప్రీం కోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో రఘురామ కృష్ణంరాజుకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రఘురామ కాలికి గాయాలు ఉన్నాయంటూ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు సుప్రీం కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో ఇటీవల ఆయనకు సుప్రీం ధర్మాసనం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఆయనను కొద్దిసేపటి క్రితం డిశ్చార్జ్ చేయడంతో నేరుగా ఢిల్లీకి బయలుదేరారు.