నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కార్యాలయం పేరు మారింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎంపీకి కార్యాలయం ఉన్న పేరును మార్చేశారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గతంలో ఎంపీ కార్యాలయానికి వైఎస్సార్ కాంగ్రెస్ నరసాపురం పార్లమెంట్ సభ్యుల వారి కార్యాలయం అనే బోర్డు ఉండేది.
కాగా ఇప్పుడు కొత్తగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా పేరు మార్చారు. అయితే ఈ మార్పునకు గల కారణాలు ఇంతవరకూ తెలియలేదు. వీటితో పాటు ఫ్లెక్సీల్లో ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను కూడా తొలగించడం జరిగింది. ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఇంతవరకూ ఈ విషయంపై స్పందించలేదు. ఇవాళ కూడా ఎంపీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ లోపల, బయట న్యాయవ్యవస్థపై దాడి జరుగుతోందని వ్యాఖ్యానించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?