MP Raghurama krishnamraju: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు గత తొమ్మిది రోజులుగా వివిధ హామీలకు సంబందించిన అంశాలను లేవనెత్తుతూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖలు రాస్తున్న విషయం తెలిసిందే. నేడు పదవ లేఖ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గురించి లేఖ రాశారు రఘురామ.
హైకోర్టు ఆదేశాలతో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాన్సాస్, సింహాచలం దేవస్థానాల ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తరువాత వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆయనపై తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. “అశోక్ గజపతిరాజు ఒక దొంగ, ఆయనపై ఫోర్జరీ కేసు కూడా గతంలో ఒకటి ఉంది. ట్రస్ట్ భూములను అక్రమంగా విక్రయించుకున్నాడు, జైలుకు వెళ్లడం ఖాయం, దొడ్డి దారిన ట్రస్ట్ చైర్మన్ అయ్యాడు. హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లి చైర్మన్ కుర్చీ నుండి దింపేస్తాం” అంటూ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రఘురామ కృష్ణంరాజు నేడు స్పందిస్తూ సీఎం జగన్ కు పదవ లేఖగా రాశారు.
Read More: Viral video: మహిళలు చీరకట్టుకుని మరీ వ్యాయామం చేయవచ్చు..! అదెలానో చూడండి..!!
మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయం విషయంలో అశోక్ గజపతిరాజు కోర్టులో గెలిచారని పేర్కొన్న రఘురామ..ఉత్తరాంధ్ర ప్రతినిధి విజయసాయి రెడ్డి నిరంతరం ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. విజయసాయి రెడ్డిని కట్టడి చేయకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి, మంత్రులను పార్టీ మంచి కోసం నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో దాగి ఉన్న భావోద్వేగం వెల్లువెత్తి 2014 పరిస్థితులు పునరావృత్తం కాకూదని కోరుకుంటున్నానని రఘురామ లేఖలో పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?