MP Raghurama Raju: నరసాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు ని సిఐడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే వారి కస్టడీలో ఉన్నప్పుడు రఘురామరాజు ని పోలీసులు టార్చర్ పెట్టారని కొంతమంది వ్యక్తులు మాస్కుల్లో వచ్చి అతని కాళ్లు వాచిపోయేలా కొట్టారని డిస్ట్రిక్ట్ కోర్టు ముందు అతని అడ్వకేట్ వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. కృష్ణంరాజు కూడా 4పేజీల ఫిర్యాదుని పోలీసులు పై వేశారు. వాచిపోయిన అతని కాళ్ళ ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి.
దీంతో కోర్టు రిమాండ్ మంజూరు చేస్తూనే ముందు రఘురామరాజు వైద్య చికిత్స పొందిన తర్వాతే అతనిని జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే హైకోర్టు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని గుంటూరు హాస్పిటల్లో డాక్టర్ల నుండి మెడికల్ రిపోర్టు తక్షణమే రావాలని ఆదేశించింది. ఇక రమేష్ హాస్పిటల్స్ నుండి గుంటూరు లోని హాస్పిటల్ కు రఘురామరాజు తరలించారు. కొద్దిసేపటి క్రితమే అతన్ని జైలుకు కూడా పంపించడం జరిగింది.
ఇక డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టులో రఘురామరాజు కాలికి ఉన్నవి తాజా గాయాలు కాదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. దీంతో పోలీసులు కస్టడీలో రఘురామరాజు పై ఎటువంటి శారీరక దాడి జరగలేదు అన్న విషయం తేలిపోయింది. రిపోర్టులో స్పష్టంగా అతని కాలిపై గాయాలు ఏమీ లేవని అవి తాజా దెబ్బల వల్ల వచ్చినవి కావని స్పష్టం చేసింది.
మెడికల్ రిపోర్టు వచ్చే లోపల రఘురామరాజు సుప్రీంకోర్టు బెయిల్ కోరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన మెడికల్ రిపోర్టు దృష్ట్యా ఖచ్చితంగాఎంపీ రాజు జైలు కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగానే పోలీసులు అతనిని టార్చర్ చేశారా…? మెడికల్ రిపోర్టు తారుమారు అయిందా…? అన్న విషయాలు పక్కన పెడితే రాజు గారు ఆడింది డ్రామా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికే ఒక ఉద్దేశానికి వచ్చేశారు.