ఏపీ రాజకీయాల్లో ఎంపీ రఘురామకృష్ణ రాజు వర్సెస్ వైసీపీ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇటివల విజయసాయిరెడ్డి ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో సిఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాయడం సంచలనంగా మారింది. ‘సీ ఓటర్ సర్వేలో 4వ స్థానం వచ్చినందుకు మీకు అభినందనలు. త్వరలో మొదటి స్థానం సాధించాలని కోరుకుంటున్నా. నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధార ఆరోపణలే.
వెంకటేశ్వరస్వామి భక్తుడిగా శ్రీవారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలనే నేను వివరించాను. టీటీడీ నిర్ణయాలను నేను ఎక్కడా వ్యతిరేకించలేదు. మీ కోటరీ నన్ను యాంటి క్రిస్టియన్ గా ముద్ర వేస్తోంది. పార్టీ క్రమశిక్షణా సంఘమే నోటీసులు ఇవ్వాలి. రిజిస్టరైన పార్టీ పేరుతో కాకుండా మరో పార్టీ లెటర్ హెడ్తో నోటీసు అందింది. నా లేఖ పట్ల మీరు సంతృప్తి పొందుతారని ఆశిస్తున్నా’నంటూ రఘురామకృష్ణరాజు ఆరు పేజీల లేఖలో స్పషం చేశారు.