రేవంత్ రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్క మాటైనా గట్టిగా వినిపించగలిగే వ్యక్తుల్లో రేవంత్ ఒకరు. మల్కాజ్ గిరి ఎంపీ. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు ఎమ్మెల్యేగా ఓడించినా.. ఎంపీగా గెలిచి తన సత్తాను చాటారు.
తెలంగాణలో అవినీతి జరుగుతున్నదా? లేదా? అనేది పక్కన పెడదాం. కానీ.. ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం సీఎం కేసీఆర్ చేసే అన్ని పనుల్లో వేలు పెడుతుంటారు. ఏ ప్రాజెక్టు నిర్మించినా.. దాంట్లో ఆ అవినీతి.. దీంట్లో ఈ అవినీతి అంటూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు.
ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుపై పడ్డారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కొండపోచమ్మసాగర్ అవినీతిపై ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి నిరూపించారు. కొండపోచమ్మ సాగర్ లో ఎంత అవినీతి జరిగిందో? ఎలా అవినీతి జరిగిందో? ఫోటోలతో సహా రేవంత్ ట్వీట్ చేశారు.
సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో అవినీతికి అంతే లేదన్నారు. నాసిరకం పనులు చేయడం వల్ల నీటి కట్టలు తెగి పడి.. పక్కన ఉన్న గ్రామాలను నీరు ముంచెత్తిందని.. రిజర్వాయర్ గేట్ల వరకు వెళ్లే వంతెన కూడా కుప్పకూలిపోయిందంటూ ట్వీట్ చేశారు.
ఏపీ మంత్రి కంపెనీ నిర్వాకాన్ని పోలీస్ పహారాతో కప్పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ… రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో మండిపడ్డారు.
కొండపోచమ్మ కథలు పేరుతో ఆయన రోజూ ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇదే…
కొండపోచమ్మ కధలు.. కేసీఆర్ స్వహస్తాలతో ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ లో అవినీతి ఆనవాళ్లు అనంతం. నిన్న కట్టలు తెగి నీళ్లు ఊళ్లమీదకు పారితే.. తాజాగా రిజర్వాయర్ గేట్ల వద్దకు వెళ్లే వంతెన కుప్పకూలింది. ఏపీ మంత్రి కంపెనీ నిర్వాకాన్ని పోలీసు పహారాతో కప్పెట్టే కుయత్నం. సిగ్గు.. సిగ్గు.. అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకా.. రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా.. ప్రాజెక్టుల అవినీతిని బయటకు తీస్తున్నారని.. దీనిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
కొండపోచమ్మ కథలు!
కేసీఆర్ స్వహస్తాలతో ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ లో అవినీతి ఆనవాళ్లు అనంతం. నిన్న కట్టలు తెగి నీళ్లు ఊళ్లమీదకు పారితే…తాజాగా రిజర్వాయర్ గేట్ల వద్దకు వెళ్లే వంతెన కుప్పకూలింది. ఏపీ మంత్రి కంపెనీ నిర్వాకాన్ని పోలీసు పహారాతో కప్పెట్టే కుయత్నం. సిగ్గు…సిగ్గు! pic.twitter.com/G1clgsKlAc— Revanth Reddy (@revanth_anumula) August 29, 2020
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?