NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టాప్ స్టోరీస్ న్యూస్

MP Vijaya Sai Reddy: ఆ నంబర్ 2 ఏమయ్యారు..! ఢిల్లీ పెద్దలతో విజయసాయిరెడ్డి సీక్రెట్ భేటీలు..!!

MP Vijaya Sai Reddy: సాధారణంగా నెంబర్ 2 అంటే గతంలో అంకెలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ మన రాష్ట్రంలో నెంబర్ 2 అంటే గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి విజయసాయి రెడ్డి పేరు అందరికీ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే సీఎం జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసుల్లో విజయసాయి రెడ్డి ఏ 2 గా ఉన్నారు. మరో వైపు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాక ముందు వరకూ ఆయనే నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా అన్నీ తానై అయి చక్రం తిప్పారు. 2014 లో పార్టీ ఓడిపోయిన తరువాత వైసీపీకి బ్యాక్ బోన్ గా ఉండి సోషల్ మీడియా వెపన్స్ ను తయారు చేసి మొత్తం అండగా నిలబడిన విజయసాయి రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత క్రమేణ ప్రభావం, ప్రాభవం పార్టీలో తగ్గుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నారు అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే జగన్మోహనరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆయనను ఇన్ చార్జి గా పెట్టారు, అయితే కొన్ని రాజకీయ మార్పులు దృష్యా, ఆయనపై కొత్తగా వస్తున్న ఆరోపణల దృష్యా, అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వైసీపీ నాయకులకు విజయసాయి రెడ్డితో ఏర్పడిన విభేదాల దృష్యా విజయసాయి రెడ్డి గతం కంటే కొంత స్పీడ్ తగ్గించారు. నిజానికి ఆయనకు ఉన్న స్పీడ్ కు, ఆయనకు ఉన్న తెలివితేటలకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ప్లేస్ లో ఉండాల్సింది. విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ చార్జిగా ఇచ్చి ఢిల్లీ వ్యవహారాలు చూసుకోమని నియమించారు. కానీ సొంత పార్టీ నేతలతో విభేదాలు కారణంగా ఉత్తరాంధ్రకు దూరం అవ్వాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఢిల్లీలోనూ జగన్మోహనరెడ్డి అనుకున్నట్లు విజయసాయిరెడ్డి చేయలేకపోవడంతో అదే విధంగా జగన్మోహనరెడ్డి అంచనాలు అందుకోలేకపోవడంతో విజయసాయిరెడ్డిని కాస్త పక్కన పెట్టినట్లుగా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

MP Vijaya Sai Reddy priority Decreased?
MP Vijaya Sai Reddy priority Decreased

MP Vijaya Sai Reddy: ఢిల్లీలో రహస్య భేటీలు

విజయసాయిరెడ్డిపై ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణలు పక్కన బెడితే ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోజు ఒకటి లేదా రెండు ట్వీట్ లతో ప్రతిపక్ష టీడీపీని అటు జనసేన పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు బీజేపీపైనా విమర్శలు చేస్తూ ఇరుకున పెట్టేవారు. ట్విట్టర్ లో నిత్యం ప్రత్యర్థులను రెచ్చగొట్టి మరీ విమర్శలు చేయించుకునేది విజయసాయిరెడ్డి.  అటువంటి విజయసాయి రెడ్డి ట్విట్టర్ ఈ మధ్య బోసిపోయింది. ఆయన మీద పంచ్ లు వేయడానికి జనసేన, టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. ఆయనేమో సైలెంట్ అయిపోయారు. రెండు మూడు రోజులకు ఒక ట్వీట్ తప్ప రెగ్యులర్ గా చేయడం లేదు. ఎక్కడా మీడియాలోనూ కనిపించడం లేదు. అక్కడ ఉత్తరాంధ్రలోనూ కనిపించడం లేదు. సో.. విజయసాయి రెడ్డి ఎక్కడ ఉన్నారు అంటే ఢిల్లీలో ఉన్నట్లు సమచారం. ఆయన ఉండాల్సిన విశాఖలో పీకే టీమ్ సర్వే నిర్వహిస్తోంది. వైసీపీ పని తీరు, గ్రేటర్ విశాఖ ఎన్నికల తరువాత అక్కడ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై సర్వే చేయడానికి పీకే టీమ్ మకాం వేసింది. ఉత్తరాంధ్రలో సమన్వయ కార్యక్రమాలు నిర్వహించాల్సిన విజయసాయిరెడ్డి గారేమో ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలోనూ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు.

ఢిల్లీలో వ్యవహారాలకు ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్

ఎందుకంటే ఢిల్లీలో ఏపి ప్రభుత్వ వ్యవహారాలను చూసేందుకు జగన్మోహనరెడ్డి తాజాగా మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. ఆయన సీఎస్ గా రిటైర్ అయిన రోజునే ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. దీంతో విజయసాయిరెడ్డి కి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరపున, పనులు ఏమి లేవు. కాకపోతే ఆయన పార్టీ వ్యవహారాల కారణంగా లోపాయికారీ కొన్ని వ్యవహారాలతో కొంత మంది బీజేపీ పెద్దలతో రహస్య మంతనాలు సాగిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ మధ్యనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. అదే విధంగా ఇంకొంత మంది కేంద్ర మంత్రులతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఇవన్నీ జగన్మోహనరెడ్డికి తెలియకుండా చేస్తున్నట్లు అయితే ఏమీ కాదు. జగన్మోహనరెడ్డి సూచన మేరకే ఏపి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా గానీ లేక వైసీపీకి అటు కేంద్రంలోని బీజేపీ మధ్య లోపాయికారీ వ్యవహారాలు అంటే అనధికార పొత్తులో భాగంగా కొన్ని చర్చల కోసం విజయసాయి రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉన్నారు. ఢిల్లీలో ఉన్నా ఆయన ట్విట్టర్ లో సైలెంట్ ఎందుకు అయ్యారు. ప్రత్యర్థులపై ఎందుకు పంచ్ లు వేయడం లేదు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే పార్టీ ఆయనను సైలెంట్ చేసింది. ఆయన హవా నెమ్మదిగా తగ్గిస్తుంది అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఉత్తరాంధ్ర కు వేరే ఇన్ చార్జిని నియమించాలని చూస్తున్నారు. ఢిల్లీలో ఏపి వ్యవహారాలను చూసేందుకు ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. దీంతో విజయసాయి రెడ్డికి కాస్త పని తగ్గినట్లే (తగ్గించినట్లే) అని అనుకుంటున్నారు.

author avatar
Srinivas Manem

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju