MP Vijayasai Reddy: ఏపిలో పెగాసెస్ కొనుగోలు వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్ నుండి పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను గతంలో ఏపి సీఎంగా ఉన్న చంద్రబాబు కొనుగోలు చేశారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ ఏపి రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యాయి. ఈ వ్యాఖ్యల నేఫధ్యంలో అధికార వైసీపీ నేతలు టీడీపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను, వైసీపీ విమర్శలను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరో సారి స్పందించారు.
MP Vijayasai Reddy: సాయికృష్ణ ను విచారిస్తే..
ఇజ్రాయిల్ కంపెనీ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్ ప్రాంచైజీగా ఉన్న అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు తనయుడు సాయికృష్ణ ను విచారిస్తే పెగాసెస్ గుట్టు బైటకొస్తుందన్నారు విజయసాయి రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం రూ.35 కోట్లతో కొనుగోలు చేసింది ఏమిటని ప్రశ్నించారు. మమత చెప్పిన పెగాసెస్ ధర కూడా రూ.25 కోట్లేనన్నారు విజయసాయి రెడ్డి. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ పై ప్రభుత్వం ఏబీవీ కుమారుడు సాయికృష్ణను విచారణ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఏపి పోలీస్ పెగాసెస్ కొనుగోలు చేయలేదంటూ గతంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించిన లేఖను టీడీపీ బయట పెట్టింది. సమాచార హక్కు చట్టం ప్రకారం ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు అప్పటి డీజీపీ సవాంగ్ సమాధానం ఇచ్చారు.
ఇజ్రేల్ కంపెనీ RT ఇన్ ఫ్లేటబుల్ ఫ్రాంచైజీగా ఉన్న అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు తనయుడు సాయికృష్ణను విచారిస్తే పెగాసెస్ గుట్టు బైటకొస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం 25 కోట్లతో కొనుగోలు చేసింది ఏమిటి? మమత చెప్పిన పెగాసస్ ధర కూడా 25 కోట్లే.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 20, 2022