కొద్ది నిమిషాల క్రితమే వైఎసార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ అని తెలిందన్న వార్తను న్యూస్ ఆర్బిట్ తెలిపింది. ఇప్పుడు ఈ వార్తలపై స్వయంగా విజయసాయి రెడ్డి స్పందించారు. తనకు కరోనా వచ్చిందని చెప్పకుండానే చెప్పినట్లు ట్వీట్ చేసారు.
“ప్రస్తుత కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నాకు నేనుగా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాను. ఒక వారం నుండి పది రోజుల పాటు క్వారంటైన్ లోనే ఉంటాను. అత్యవసరాలకు తప్ప నేను ఫోన్ లో కూడా అందుబాటులో ఉందని” అని ట్వీట్ చేసారు. ఎంపీ విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ అని వార్తలు వ్యాపిస్తున్న సమయంలో ఈ ట్వీట్ రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అందరూ ఈ ట్వీట్ కు త్వరగా కోలుకోండి అని కోరుకుంటున్నారు.