లోక్ సభలో ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించే బిల్లుకు ఈరోజు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకోవడం విశేషం. కోవిడ్-19తో తలెత్తిన అవసరాలను తీర్చడానికి పార్లమెంట్ సభ్యుల వేతనాలు, పెన్షన్ (సవరణ) బిల్లు, 2020కు లోక్ సభ ఆమోదం తెలిపింది.
నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణలపై లోక్ సభలో చర్చ నడుస్తోంది. దీనిపై నిర్ణయం కీలకం కానుంది. రాజ్యసభలో ఎయిర్క్రాఫ్ట్ సవరణ బిల్లుకు ఆమోదం తెలపడంపై పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి సంతోషం వ్యక్తం చేసారు. ఇక ఈరోజు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఇండియా – చైనా సరిహద్దు విషయంలో స్పందిస్తూ ఇంకా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.