అమరావతి: టిడిపిని వీడి బిజెపిలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులు నేడు ప్రధాని మోదితో భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్, గరికపాటి రామ్మోహన్లు నిన్న బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. రాజ్యసభలో టిడిపి పక్షాన్ని బిజెపిలో విలీనం చేయాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుని కోరారు.
నేడు వీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ప్రధాని నివాసానికి వెళ్లి మోదితో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో బిజెపి భవిష్యత్తు కార్యాచరణ, బిజెపి పటిష్టతకు సంబంధించిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ నలుగురు నేతలకు బిజెపి అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నలుగురు చేరికతో రాజ్యసభలో బిజెపి బలం 75కు చేరింది.