పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఒకేసారి నాలుగు సినిమాల అప్డేట్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ నుంచి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2021 లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నూతన చిత్రం కూడా ఈ ఏడాది డిసెంబర్ లో చిత్రీకరణ మొదలు పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అలాగే క్రిష్,పవన్ కళ్యాణ్ సినిమా 2021 జనవరి నుంచి మళ్ళీ సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతుందట. ఈ సినిమాలతో పాటు సురేందర్ రెడ్డి సినిమా కూడా 2021 లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న భారీ చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. సామాజిక అంశంతో పాటు మంచి సందేశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ఒకటి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ కాగా… ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం వినాయక్ చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు కీలక మార్పులు చేస్తున్నాడట. అలాగే మెహర్ రమేష్ సినిమాలో నటించబోతున్నట్టు తాజాగా పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ చేశారు.
అయితే ఇంతక ముందు మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించాలనుకుంటున్నట్టు టి. సుబ్బిరామి రెడ్డి ప్రకటించినట్టు వార్తలు వాచ్చాయి. ఈ సినిమాకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడని భారీ మల్టీ స్టారర్ గా రూపొందిస్తాడని చర్చించుకున్నారు. కాని ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి న్యూస్ లేకపోవడంతో అందరూ ఇక ఈ ప్రాజెక్ట్ లేదనే క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది.