తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు పల్లెలు గోదావరి పరివాహక భూపాలపల్లి జిల్లాలో దట్టమైన అడవులలో మళ్లీ మావోయిస్టుల కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. అంతే కాకుండా పెద్దంపేట లేనకలగడ్డ అడవుల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరగడంతో పాటు భారీగా సామాగ్రి దొరకటంతో… పదుల సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు . ఈ పరిణామంతో పోలీస్ ఉన్నత అధికారులు అప్రమత్తమయ్యారు.
అంతేకాకుండా ప్రత్యేక గస్తీ పెంచారు. అదే రీతిలో కూంబింగ్ మరింత విస్తృతం చేశారు. ఈ క్రమంలో దొరికిన వస్తువులను బట్టి పోలీసులు మావోయిస్టుల బలం ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తున్నారు. దాదాపుగా రెండున్నర దశాబ్దాలుగా అదే ప్రాంతంలో ఉన్న లోనికి వస్తుంది. 1994లో మావోయిస్టులు పంజాబ్ కమాండోలను అదే ప్రాంతంలో మట్టు పెట్టడం జరిగింది.
2003 ప్రాంతంలో జనశక్తి సూర్యం దళం ఎన్కౌంటర్లో హతం అవ్వటం జరిగింది. కథ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగటంతో కలకలం సృష్టిస్తుంది. తాజాగా జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు తప్పించుకోవడంతో ఏజెన్సీ గ్రామాల్లో భయం నెలకొంది. ఇదిలా ఉండగా దీపావళికి గట్టిగానే మావోయిస్టులు తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేసినట్లు పోలీసులు దొరికిన సామాగ్రి బట్టి అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా మళ్లీ మావోయిస్టులు కార్యకలాపాలకు రెడీ అవటంతో పోలీసుల లో అదేవిధంగా ప్రజలలో మరియు రాజకీయ రంగంలో టెన్షన్ పట్టుకుంది.