Ambani London Shift ముకేశ్ అంబానీ.. ఈ పేరును స్సెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మన దేశంలో కార్పొరేట్ దిగ్గజంగా పేరు సంపాదించుకున్నాడు ముకేశ్. ప్రపంచంలో వేరు వేరు దేశాల్లో సైతం తన బిజినెస్ లను కొనసాగిస్తున్న ఈ వ్యాపార దిగ్గజం.. రిలయన్స్ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే దాన్ని అప్ గ్రేడ్ చేస్తూ జియో పేరుతో పెద్ద విప్లవాన్నే తీసుకొచ్చాడని చెప్పాలి. ఈ ఫోన్ మార్కెట్లోకి రాగానే దాదాపు అన్ని నెట్వర్క్ కంపెనీలు డీలా పడిపోయాయి. కస్టమర్స్ను ఎక్కువగా అట్రాక్ట్ చేసుకునేందుకు తక్కువ ధరలకే ఫోన్లు అందుబాటులోకి తీసుకొచ్చాడు. తర్వాత మార్కెట్ మొత్తాన్ని దాదాపుగా తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు ముకేశ్..
ధనవంతుల్లో టాప్..
ప్రపంచంలోనే ధనవంతుల్లో ఈయనది 11వ ప్లేస్. అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ వార్త హల్ చల్ అవుతోంది. లండన్(London)లో ఆయన ఒక పెద్ద ఇంటిని కంస్ట్రక్షన్ చేయిస్తున్నారని ఓ ఇంగ్లిష్ పేపర్లో కథనం వచ్చింది. దీంతో పాటు ఆయన త్వరలోనే ఇండియా నుంచి ఫ్యామిలీతో పాటు అక్కడికే షిప్ట్ అవ్వబోతున్నారని చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీటి పట్ల అంబానీ కానీ, రిలయన్స్ ప్రతినిధులు గానీ మొన్నటి వరకు స్పందించలేదు.
స్పందించిన రిలయన్స్
ముకేశ్ అంబానీ లండన్ షిప్ట్ అవుతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారడంతో ఎట్టకేలకు రిలయన్స్(Reliance) స్పందించింది. అంబానీ లండన్కే కాదు.. ఏ దేశానికి వెళ్లడం లేదని ప్రకటన విడుదల చేసింది. ఆయన లండన్ కు షిప్ట్ అవుతారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. కాకపోతే లండన్లో తాజాగా స్టోక్ పార్క్ ఎస్టేట్ ను కొనుగోలు చేసిన వార్త నిజమేనని తెలిపింది. దానిని గోల్పింగ్ క్లబ్ తో పాటుగా క్రీడా రిస్టార్ట్ గా మార్చేందుకు కొనుగోలు చేసినట్టు స్పష్టం చేసింది. మరిన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆయన లండన్ షిప్ట్ అవతారనే వార్తకు ఫుల్ స్టాప్ పడినట్టయింది.