ముంబాయి, మార్చి 8: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల పెద్ద కుమారుడు అకాశ్ అంబానీ వివాహ వేడుకల సందర్భంగా ‘అన్నసేవ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
అకాశ్ అంబానీ, శ్లోక మెహతాల వివాహం రేపు (శనివారం) జరగనుంది.
బ్యాచిలర్ పార్టీ, ప్రీ సంగీత్ పార్టీ వేడుకలు పూర్తి అయ్యాయి.
అంబానీ కుటుంబ తాజా సాంప్రదాయం ప్రకారం ‘అన్నసేవ’తో పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి.
ధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్, ఇతర ఎన్జిఒ సంస్థలకు చెందిన సుమారు రెండు వేల మందికిపైగా పేద విద్యార్థులకు ఈ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు.
ముంబాయిలోని అనాధ శరణాలయాలకు చెందిన పేద పిల్లలందరికీ అన్నసేవ కార్యక్రమాన్ని ఈ నెల 13వ తేదీ వరకూ నిర్వహించనున్నారు.
13వ తేదీ వరకూ జరుగున్న పెండ్లి వేడుకల్లో భాగంగా గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నేడు మెహందీ, సంగీత్ వేడుకలు నిర్వహిస్తారు.
గత నెల స్విట్జర్లాండ్లో బ్యాచిలర్ పార్టీ నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, రణ్భీర్ కపూర్, అలియా భట్, మలైకా అరోరా, ఖుషీకపూర్, అర్జున్ కపూర్, షారుక్ ఖాన్ దంపతులు పాల్గొన్నారు. సుమారు 900మంది అతిథులకు పైగా ఈ వేడుకలకు హజరయ్యారని సమాచారం.
వధువు శ్లోకా మెహతా ప్రముఖ వజ్రాల వ్యాపారి రుస్సెల్ మెహతా కుమార్తె.
రేపు జరగనున్న వివాహ మహోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో అతిధులు హజరుకానున్నారు.
ఉదయ్పూర్లో డిసెంబర్ నెలలో జరిగిన కుమార్తె ఈషా వివాహ వేడుకల సందర్భంలోనూ ‘అన్నసేవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు ఐదు వేల మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
https://www.instagram.com/p/But2qlxjTqE/