బిగ్ బాస్ తెలుగు సీజన్ 4. అసలే కరోనా కాలం. అసలు ఈసారి బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుందా? లేదా? అని అంతా నిట్టూర్చారు. కానీ.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ.. అతి కష్టం మీద బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం అయింది.
అయితే.. ప్రారంభం అవడంతోనే నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది బిగ్ బాస్ షో. ఎందుకంటే.. ఈ సారి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లలో ఎవ్వరూ పెద్దగా ప్రేక్షకులకు తెలిసిన వాళ్లు లేకపోవడం.. దానితో పాటు.. మొదటి రెండు వారాల్లో ఎవ్వరూ సరిగ్గా ఆట ఆడకపోవడంతో.. ఈ సీజన్ పని అయిపోయినట్టే అని ప్రేక్షకులు అనుకున్నారు.కానీ.. ఒక్కసారిగా మూడో వారం నుంచి షో ఉవ్వెత్తున లేచింది. కంటెస్టెంట్ల మధ్య లవ్ స్టోరీలు, గొడవలు, మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో షో ఒక్కసారిగా సందడిగా మారింది.
అయితే.. ముందు వచ్చిన కంటెస్టెంట్లు కానీ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్లలో కానీ.. ఫుల్లు ఎంటర్ టైన్ మెంట్ ను పండిస్తున్నారు అంటే అది జబర్దస్త్ అవినాష్ అనే చెప్పుకోవాలి.
రావడం రావడమే తనను ఒక జోకర్ గా ట్రీట్ చేసుకుంటూ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు అవినాష్. ఆయన వల్ల హౌస్ లో కాస్త కామెడీ పండుతోంది. ఓవైపు అమ్మ రాజశేఖర్ మాస్టార్.. మరోవైపు అవినాష్.. ఇద్దరూ కలిసి హౌస్ లో కాస్త ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తున్నారు. లేదంటే… షో చప్పగా ఉండేది.
అయితే.. అవినాష్.. బిగ్ బాస్ షోకు రావడానికి చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే.. ఆయన జబర్దస్త్ ను పూర్తిగా వదిలేసి బిగ్ బాస్ షోకు రావాల్సి వచ్చింది. జబర్దస్త్ కు ఉన్న కాంట్రాక్ట్ వల్ల ఆయన హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం కాస్త లేట్ అయింది. కాంట్రాక్ట్ ను బ్రేక్ చేయడానికి ఎమౌంట్ కూడా కట్టి అవినాష్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు.. అంటూ వార్తలు కూడా వచ్చాయి.
అయితే.. ముక్కు అవినాష్ కు బిగ్ బాస్ హౌస్ లో ఎంత పారితోషకం ఇస్తున్నారో తెలుసా? వారానికి 7 లక్షలు. అంటే.. రోజుకు లక్ష రూపాయల పారితోషకాన్ని అవినాష్ పొందుతున్నాడు. నిజానికి.. హౌస్ లో ఎక్కువ పారితోషకం పొందుతున్నది లాస్య. ఆమె తర్వాత అంత పెద్ద మొత్తంలో పారితోషకం పొందే వ్యక్తి ముక్కు అవినాషేనట.
అయితే.. ముక్కు అవినాష్.. ప్రస్తుతం ఆట బాగా ఆడుతున్నాడని.. ఈమధ్య బిగ్ బాస్ తో పాటు, హోస్ట్ నాగార్జున కూడా మెచ్చుకోవడం చూస్తుంటే.. టాప్ 5 కంటెస్టెంట్లలో అవినాష్ ఖచ్చితంగా ఉంటాడనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. చూద్దాం.. అవినాష్.. హౌస్ లో ఇంకా ఎంతమేరకు ప్రేక్షకులను నవ్విస్తాడో?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?