అన్ లాక్ 3.0లో భాగంగా భారత ప్రభుత్వం కొత్త విధివిధానాలను ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులో భాగంగా రాత్రిపూట కొనసాగుతున్న నిషేధాన్ని ఆగష్టు 1నుండి ఎత్తివేయనున్నారు. అలాగే జిమ్, యోగా సెంటర్లు తెరుచుకోవడానికి ఆగష్టు 5నుండి అనుమతులు ఇచ్చారు.
ఇదిలా ఉండగా మళ్ళీ థియేటర్ల మూసివేతను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే మేము ఎన్నోసార్లు థియేటర్లు తెరవాలని విజ్ఞప్తి చేసాం. సామాజిక దూరం పాటిస్తూనే ఎలా థియేటర్లను నడపగలమో ప్రభుత్వానికి తెలియపరిచాం. అయినా కూడా మా విన్నపాన్ని ప్రభుత్వం మన్నించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొన్ని లక్షల మంది థియేటర్లను నమ్ముకుని జీవిస్తున్నారు అని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది.