బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)గా మారిందని ఆరోపించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. బ్రిహాన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు బుధవారం ముంబైలోని బాంద్రాలో ఉన్న కంగనా రనౌత్కు చెందిన పలు నిర్మాణాలను అక్రమంగా నిర్మించిందని చెబుతూ వాటిని కూల్చేశారు. దీంతో కంగనా ఫైరైంది. తాను ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని స్పష్టం చేసింది.
తన ఆఫీసు, ఇంట్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేవని, బీఎంసీ కావాలనే తన నిర్మాణాలను కూల్చివేసిందని కంగనా ఆరోపించింది. కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ 30 వరకు ఎలాంటి నిర్మాణాలను కూల్చివేయవద్దని ఆదేశాలు ఉన్నాయని, అయినా తన నిర్మాణాలను కూల్చివేశారని తెలిపింది. కాగా శివసేన నాయకుల నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో కంగనాకు ఇప్పటికే కేంద్రం వై కేటగిరి సెక్యూరిటీని కల్పించింది. ఈ క్రమంలో ఆమె మనాలి నుంచి ముంబైకు బుధవారం వస్తోంది.
https://twitter.com/KanganaTeam/status/1303574493273550851?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1303574493273550851%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.hindustantimes.com%2Fbollywood%2Fkangana-ranaut-vs-shiv-sena-latest-updates-actor-says-mumbai-is-pok-now-as-bmc-carries-out-demolition-work-at-her-property%2Fstory-oIbwzdDQs4JFJcCA6YiakO.html
అయితే కంగనా ముంబై రాకూడదని గతంలో శివసేన ఎంపీ రౌత్ అన్నారు. కాగా దానిపై ఆమె కౌంటర్ ఇచ్చింది. దేశంలో తనకు ఎక్కడైనా ఉండే హక్కు ఉందని, ఎక్కడికైనా వెళ్తానని స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఆమె తిరిగి ముంబైకి వస్తోంది. ఈ క్రమంలో కర్ణిసేన కార్యకర్తలు ఆమెకు మద్దతుగా, రక్షణగా నిలిచారు. కాగా ఆమె ముంబైకి రాకముందే ఆమె ఇల్లు, ఆఫీసులోని పలు నిర్మాణాలను బీఎంసీ కూల్చివేయడం వివాదాస్పదమవుతోంది.
https://twitter.com/KanganaTeam/status/1303586065597440000?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1303586065597440000%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.hindustantimes.com%2Fbollywood%2Fkangana-ranaut-vs-shiv-sena-latest-updates-actor-says-mumbai-is-pok-now-as-bmc-carries-out-demolition-work-at-her-property%2Fstory-oIbwzdDQs4JFJcCA6YiakO.html
ఇక తన నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యాలను బాలీవుడ్ చూడాలని.. ఫాసిజం అంటే ఇలాగే ఉంటుందని కూడా కంగనా ట్వీట్ చేసింది. దీంతో ఆమె ట్వీట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ముంబైలో కంగనా వర్సెస్ శివసేనగా వాతావరణం మారింది.