సరిగ్గా లాక్ డౌన్ సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో మూడు పదుల వయసు కలిగిన సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవటం అందరికి షాక్ గురిచేసింది. ప్రధాని మోడీ మొదలుకొని చాలామంది సుశాంత్ మరణించడం పై బాధ పడటం జరిగింది. ఆయన మరణం పట్ల అనేక మంది అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ కి అవకాశాలు రాకుండా బాలీవుడ్ పెద్దలు అడ్డుపడటంతో ఆయన మరణించినట్లు అందరూ భావించారు.
ఈ క్రమంలో సుశాంత్ తో ఇంటి సభ్యులు సుశాంత్ లవర్ రియా చక్రవర్తి పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సరికొత్త ట్విస్ట్ నెలకొంది. ఒకవైపు ముంబై పోలీసులు మరోవైపు బీహార్ పోలీసులు ఈ కేసును టేకప్ చేయటంతో డ్రగ్స్ కోణం బయటపడటంతో సుశాంత్ డెత్ పెద్ద మిస్టరీ గా మారిపోయింది. ఇదే తరుణంలో కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించగా , తాజాగా ఈ కేసుపై ముంబై హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎస్ షిండే షాకింగ్ కామెంట్ చేయడం పెద్ద సంచలనంగా మారింది.
ఆయన సుశాంత్ కేస్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. “కేసు ఏదైనా కానివ్వండి.. అతని ముఖం చూస్తే చాలా జాలిగా అమాయకుడిగా ఉందనీ హుందాగా వ్యవహరించేవాడని అర్థమవుతున్నట్లు, ముఖ్యంగా ఎంఎస్ ధోని సినిమా చూసి చాలా మంది అతని నటనకు ఫిదా అయినట్లు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కేస్ లో డ్రగ్స్ కోణం బయటపడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి విచారణ చేయడమే కాక పలువురిని అరెస్టు చేయడం జరిగింది. ఇంకా విచారణ కొనసాగుతున్న తరుణంలో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు టాక్. అంతే కాకుండా ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఆమె తమ్ముడు జైలుకు వెళ్లడమే కాక బెయిల్ పై బయట ఇష్టానుసారంగా చలామణి అవుతున్నారు. మరోపక్క కేసు విచారణ మొత్తం పూర్తయ్యేసరికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.