NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ బిగ్ స్టోరీ

Drugs Case: డ్రగ్స్ కేసు వెనుక దాగున్న భయానక నిజాలు ఇవి..! దొరికితే దొంగ దొరక్కపోతే..!?

Drugs Case: రాష్ట్ర ప్రభుత్వం తో లింకులు ఉన్న డ్రగ్స్ స్కామ్ ఒకటి ఇటీవల బయటపడింది. గుజరాత్ లోని మొండ్రా పోర్టులో తొమ్మిది వేల కోట్ల విలువైన మూడు వేల కిలోల హెరాయిన్ పట్టుబడింది. ముండ్రా పోర్టు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదానీ గ్రూప్ చెందినది. అక్కడి పోర్ట్ నుండి ఆంధ్రప్రదేశ్ కు రావలసిన మూడు వేల కిలోల హెరాయిన్ పట్టుబడింది. దీంతో గుజరాత్ కు ఆంధ్రప్రదేశ్ కు మధ్య డ్రగ్స్ గుట్టు ఏదో ఉందని బయటకు వచ్చింది. దీని విలువ కూడా భారీగా ఉండటంతో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా దీనిపై ఫోకస్ పెట్టాయి. ఈ డ్రగ్స్ రవాణాకు సంబంధించి సోషల్ మీడియాలో టీడీపీ అనుకూల మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వస్తుండగా, దీనిపై ప్రభుత్వానికి, వైసీపీకి సంబంధం లేకపోతే సాక్షి మీడియాలో ఎందుకు కథనాలు ఇవ్వటం లేదు?. టిడిపి అనవసరంగా రాద్ధాంతం చేస్తుందనో, ప్రభుత్వానికి వైసిపికి సంబంధం లేదనో ఏదో ఒకటి రాయాలి కదా, కానీ సాక్షి దాని గురించే రాయడం లేదు. ఆ డ్రగ్స్ ఎవరివి? ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నాయి. పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది అంటూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేలాసాక్షి లో కథనాన్ని ఎందుకు ఇవ్వలేదు?. ఆదాని పోస్టులో డ్రగ్స్ దొరికాయి కాబట్టి సంచలనం విషయం అయ్యింది. దొరకకుండా ఎన్నెన్నో పోతున్న విషయం అందరికీ తెలిసిందే.

దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అంబానీ, ఆదాని ఆస్తులు విపరీతంగా పెరిగాయి. దీనిలో భాగంగా చాలా పోర్టులు ఆదోని పరం అవుతున్నాయి. ఏపిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా పది శాతం ఉంటే అదీ కూడా ఆదానీకి అమ్మేశారు. కృష్ణపట్నంలో నవయుగ కు 75 శాతం ఉంటే వాళ్లకు పూర్తిగా పక్కకు వెళ్లి అదానీకి ఇచ్చేశారు. వేరే పోర్టులు కూడా ఆదానీకి ఇవ్వడానికి మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే కొత్త పోర్టులు రానివ్వడం లేదు. కృష్ణపట్నం పోర్టు ఆదానీ చేతిలో ఉంది. గంగవరం పోర్టు ఆదానీ చేతిలో ఉంది. ఇక కాకినాడ పోర్టు, విశాఖపట్నం పోర్టు, విశాఖపట్నం పోర్టు కేంద్ర ప్రభుత్వానిది కావడంతో ఎవరి చేతిలోకి వెళ్లదు. కాకినాడ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మేజర్ వాటా ఉండటం వల్ల దాని జోలికి వెళ్లడం లేదు. బహుశా అది కూడా కొనేస్తే కొనేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే కొత్త పోర్టులు ఎందుకు రావడం లేదు. ప్రకాశం జిల్లా రామయపట్నం పోర్టు ఎందుకు రావడం లేదు. ఎవరైనా ఆలోచించారా. అదే విధంగా మచిలీపట్నం పోర్టు. ఇది ఎందుకు రావడం లేదని ఆలోచించారా. ఎందుకు వాటి అడుగులు పడటం లేదు. నిర్మాణం జరగడం లేదని. కొత్త పోర్టులు రావు. రానివ్వరు. కొత్త పోర్టులు వస్తే పాట పోర్టులకు రవాణా తగ్గిపోతుంది. ఇలాంటి అక్రమ రవాణాలు తగ్గుతాయి. తద్వారా వాటి ఆదాయం కూడా తగ్గుతుంది. సో..కొత్త పోర్టులు వస్తే ఇప్పుడు ఉన్న పోర్టులు ఆదానీ చేతిలో ఉన్నాయి. కొత్త పోర్టులు కూడా వారి చేతికి వచ్చే అవకాశం ఉంటే ఈసీగానే వస్తాయి. ఒక వేళ కొత్త పోర్టులు వేరే వారికి వస్తే వీరి బిజినెస్ జరగదు కాబట్టి ప్రభుత్వాలకు, ఈ కార్పోరేట్ సంస్థలకు ఉన్న సంబంధం కారణంగా కొత్త పోర్టులను రానివ్వరు.


దొరికితేనే దొంగ. దొరకపోతే దొరే. ఇప్పుడు ముండ్ర పోర్టులో 3వేల కేజీల హెరాయిన్ పట్టుబడింది. అక్కడ డీఆర్ జీ కొత్త అధికారి వచ్చారు కాబట్టి తనిఖీల్లో 3వేల కేజీల హెరాయిన్ దొరికింది. పాత అధికారులు ఇప్పటి వరకూ చెక్ చేయకుండా ఎన్నింటిని వదిలివేశారో తెలియని పరిస్థితి. ఎన్ని వేల కిలోలు అక్రమ రవాణా జరిగిందో. ఇది బయటకు వచ్చింది కాబట్టి సంచలన వార్త అయ్యింది. బయటకి రానివి రోజుకు సుమారుగా పదివేల కిలోల ఉంటుంది. రోజుకు సుమారుగా రూ. 50వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ పోర్టు నుండి చుట్టుపక్కల రాష్ట్రాలకు రవాణా అవుతుంటుంది. మేజర్ పోర్టుల్లో ఆదానీ వాటా ఉంటుంది. ఆ పోర్టుల నుండి ఈ రకమైన అక్రమ రవాణాలు లెక్కకు మించి జరుగుతూనే ఉంటాయి. పట్టించుకోవాలంటే ఆదానీ పోర్టులు అన్నింటిపై కాన్సట్రేషన్ చేయాలి. డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో దృష్టి సారించాలి. ఇప్పుడు దొరికిన 3వేల కిలోల హెరాయిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా రెస్పాండ్ అయ్యిందా అంటే లేదు. కేంద్ర హోంశాఖకు సంబంధం లేదా. ఈ పట్టుబడిన హెరాయిన్ ఎక్కడి నుండి వచ్చింది. ఎక్కడికి వెళుతుంది, ఇప్పటి వరకూ ఎంత వరకు లావాదేవీలు జరిగాయి అనేది కేంద్రం దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదా. అంత వేల కోట్ల విలువైన డ్రగ్స్ అయినప్పుడు ఏ దేశం నుండి వస్తుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత లేదా. కానీ కేంద్రం సీరియస్ గా పట్టించుకోలేదు. కారణం ఏమిటంటే అది అదానీ పోర్టు కావడమే.

అలాగే పట్టుబడిన హెరాయిన్ విజయవాడ అడ్రస్ పేరుతో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకుడి బంధువు సుధాకర్ అనే వ్యక్తి పేరు మీద హెరాయిన్ వస్తోందని ఇలా ఏవేవో ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం అయినా దీనిపై కేంద్రానికి లేఖ రాయాలి. గుజరాత్ రాష్ట్రంలోని పోర్టు నుండి మా రాష్ట్రానికి హెరాయిన్ పెద్ద ఎత్తున రవాణా అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, సీబీఐ దర్యాప్తు చేయించండి వీటిపై నిజాలు నిగ్గు తేల్చండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు కోరలేదు. ఈ డ్రగ్స్ విషయంలో ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు. సైలెంట్ అయిపోతున్నారు. అదీ కాక ఇది మాకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. ఎందుకుంటే అది ఆదానీ పోర్టు కావడమే. ప్రస్తుతం డ్రగ్స్ దొరికాయి కాబట్టి వారం రోజులు వార్తలు ఉంటాయి. ఆ తరువాత యధా మమూలుగా రవాణాలు జరుగుతూనే ఉంటాయి. ఇటువంటివి జరుగుతుండటం వల్లనే వారి సంపద వివరీతంగా పెరిగిపోతున్నాయి.

author avatar
Srinivas Manem

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju