Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు బిజీబీజీగా పావులు కదుపుతున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి చేరిన నేపథ్యంలో మునుగోడులో బీసీ ఓటర్లు చేజారకుండా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ బీజేపీ లోని తెలంగాణ ఉద్యమకారులపై దృష్టి పెట్టారు. బీజేపీలోని తెలంగాణ ఉద్యమకారులకు నేరుగా సీఎం కేసిఆర్ ఫోన్ లు చేసి టీఆర్ఎస్ లో చేరాలని బుజ్జగింపు లు ప్రారంభించినట్లు తెలుస్తొంది.
బీజేపీకి రాజీనామా చేసిన దాసోజు శ్రావణ్ ఈ సాయంత్రం టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. శ్రావణ్ బాటలో మరి కొందరు ఉద్యమ కారులు, బీసీ నేతలను చేర్చుకునేందుకు మంత్రి కేటిఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. స్వామిగౌడ్, విఠల్ తో కేటిఆర్ చర్చలు జరుపుతున్నారని సమాచారం. మంత్రి కేటిఆర్ సమక్షంలో ఈ సాయంత్రం దాసోజు శ్రావణ్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రాజీనామా లేఖ ను దాసోజు శ్రావణ్ పంపించారు. దాసోజు శ్రావణ్ బీజేపీలో చేరి నెలలు కూడా కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో టీఆర్ఎస్ లోనే ఉన్న శ్రావణ్ టీఆర్ ఎస్ ను విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో పని చేసిన శ్రావణ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఖరితాబాద్ నియోజకవర్గంలో పీజేఆర్ కుమార్త్ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరిని విభేదించి ఆయన బీజేపీలో చేరారు. శ్రావణ్ ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. అయితే కొద్ది రోజుల వ్యవధిలోనే బీజేపీకీ రాజీనామా చేసి తిరిగి టీఆర్ఎస్ లోకి చేరబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న విధానం జుగుప్సాకరంగా ఉందని ఆయన అంటున్నారు. కాంట్రాక్టర్లు డబ్బులతోనే రాజకీయం చేయాలని అనుకుంటున్నారని శ్రావణ్ పేర్కొంటున్నారు.
Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?