Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. మద్యాహ్నం వరకూ మందకొడిగా పోలింగ్ జరిగినా ఆ తర్వాత ఊపందుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ,. కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. సాయంత్రం 6 గంటల వరకూ 77.55 శాతం నమోదు కాగా పోలింగ్ ముగిసే సమయానికి 90 శాతం దాటవచ్చని భావిస్తున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఆలస్యం అయినా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది ఈసీ. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
మరో పక్క ఉత్కంఠ భరితంగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో విజేత గా ఎవరు నిలవబోతున్నారు అనేది ఎన్నికల సర్వే సంస్థలు అంచనా వేశాయి. దాదాపుగా అన్ని సంస్థలూ టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి నిలుస్తారని సర్వే సంస్థలు వెల్లడించాయి.
సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా
ఆత్మసాక్షి
టీఆర్ఎస్ అభ్యర్ధికి 41 నుండి 42 శాతం ఓటింగ్
బీజేపీ అభ్యర్ధికి 35 నుండి 36 శాతం
కాంగ్రెస్ అభ్యర్ధికి 16.5 నుండి 17.5 శాతం
పీపుల్స్ పల్స్
టీఆర్ఎస్ – 44.4 శాతం
బీజేపీ – 37.3 శాతం
కాంగ్రెస్ – 12.5 శాతం
ఇతరులు – 5.8 శాతం
త్రిశూల్
టీఆర్ఎస్ – 47 శాతం
బీజేపీ – 31 శాతం
కాంగ్రెస్ – 18 శాతం
ఇతరులు – 4 శాతం
థర్డ్ విజన్
టీఆర్ఎస్ – 48 నుండి 51 శాతం
బీజేపీ – 31 నుండి 35 శాతం
కాంగ్రెస్ – 5 నుండి 7 శాతం
కేఏ పాల్ – ఒక శాతం