దేశంలో నిత్యం ఏదో ఒక చోట ప్రేమ గురించి హత్యలు మరియు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని విషయాలలో జాగ్రత్త తీసుకుంటూ పెళ్లి విషయంలో మాత్రం తమ పిల్లలకు నచ్చిన వారిని కాకుండా తమకు నచ్చిన వారిని ఇచ్చి పెళ్లి చేస్తుంటారు. అయితే, తాజాగా హర్యానాలో ఇటువంటి ఘటనే జరిగింది. పెళ్లికి సిద్దమవుతున్న ఒక ప్రేమ జంటపై అమ్మాయి తండ్రి కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ల వర్షానికి ఈ ఘటనలో ప్రియుడు మరియు ప్రియురాలు ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
పోలీసులు విచారణలో తెలిసిన విషయాలు ఏమనగా, హర్యానాలోని రోహతక్ జిల్లాకు చెందిన రోహిత్ మరియు పూజ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమనగా వీరిద్దరి కులం ఒకటే కానీ, వీరి ఇద్దరివీ వేర్వేరు గ్రామాలు. పూజ తల్లితండ్రులకి నచ్చని విషయం ఏమిటంటే రోహిత్ ఫ్యామిలీతో పోల్చితే పూజ తల్లిదండ్రులు బాగా ధనవంతులు. వీరి ప్రేమకి రోహిత్ కుటుంబ సభ్యులు ఓకే చెప్పారు కానీ అమ్మాయి తరపు వారు ఒప్పుకోలేదు. ఆర్థికంగా వెనకబడిన రోహిత్ ఫ్యామిలీ లోకి తమ కుమార్తెను ఇస్తే సమాజంలో తమ పరువు పోతుందని పూజ తల్లితండ్రులు భావించారు. అందుకే వీరి ప్రేమను అస్సలు అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో ఇద్దరూ మేజర్ లు కావడంతో కోర్టులో పెళ్లి చేసేందుకు రోహిత్ కుటుంబ సభ్యులు సహకరించారు. పూజ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో మేము కూడా ఒప్పుకుంటున్నాం అని చెప్పారు. ఆ మాటలు నమ్మి తన తండ్రి తన ప్రేమను అంగీకరించాడని సంతోషపడింది.
వీరిద్దరి పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు కోర్టుకు వెళ్తుండగా ఎవ్వరు ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఆ ప్రేమ జంటపై ఢిల్లీ బైపాస్ రోడ్డుకు చేరిన తర్వాత బుల్లెట్ల వర్షం కురిసింది. పూజ స్పాట్లోనే చనిపోగా తీవ్రంగా గాయపడిన రోహిత్ ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రోహిత్ కూడా మరణించాడు.